మిస్ చేసుకున్నమొబైల్ 18 నెలల తరవాత రికవరీ
— ఆధనపు పిఎస్పీ మహేందర్
ధైర్యాన్ని కోల్పోకుండా సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో నమోదు చేసుకో
వాలి అదనపు ఎస్.పి. అడ్మిన్ ఎస్.మహేందర్ అన్నారు.
ఈ సందర్భంగా మెదక్ జిల్లా అదనపు ఎస్.పి. అడ్మిన్ ఎస్.మహేందర్ మాట్లాడుతూ…
పెంటయ్య అనే వ్యక్తి మొబైల్ ను ఔరంగబాద్ గ్రామంలో 2023 జూన్ లో మిస్ చేసుకున్నాడు, అతను వెంటనే పోలీస్ స్టేషన్ కు వచ్చి దరఖాస్తు ఇవ్వగా ఫోన్ నెంబర్ ను మరియు ఐ ఎం ఈ ఐ నంబర్ ను సి ఈ ఐ ఆర్ పోర్టల్ నందు అప్లోడ్ చేయడం జరిగింది. ఆ మొబైల్ ను గత వారం క్రింద ఉత్తరప్రదేశ్ లో ఆన్ చేయడం జరిగింది. సి ఈ ఐ ఆర్ పోర్టల్ నుండి సమాచారం సేకరించి మొబైల్ దొరికిన వ్యక్తి కి 94 బి ఎన్ ఎస్ ఎస్ ప్రకారం మెదక్ జిల్లా పోలీస్ కార్యాలయం నుండి అతనికి నోటిసు పంపడం జరిగింది. పంపించనియెడల చట్ట పరమైన చర్యలకు సిద్దమౌతామని ఆ నోటిస్ లో పొందుపరచడం జరిగింది. అతను వెంటనే బయపడి కొరియర్ ద్వారా జిల్లా పోలీస్ కార్యాలయానికి మొబైల్ ను పంపించడం జరిగిందని అన్నారు. కాబట్టి మొబైల్ పోయిన వెంటనే ధైర్యని కోల్పోకుండా సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో నమోదు చేసుకోవాలి అని జిల్లా అదనపు ఎస్.పి. అన్నారు. మొబైల్ ను బాధితుడికి అందించడం లో కృషి చేసిన లాయక్ అలీ మరియు
మహేందర్ గౌడ్ ను అబినంధించారు.
ఎవరైనా ఫోన్ పోగొట్టుకుంటే, లేదా గుర్తుతెలియని వ్యక్తులు దొంగతనంగా ఎత్తుకొని పోయిన వారు వెంటనే కేంద్ర ప్రభుత్వం నూతనంగా తీసుకువచ్చిన సి ఇ ఐ ఆర్ (సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోర్టల్) పూర్తి వివరాలు నమోదు చేసి పోగొట్టుకున్న ఫోన్ ను నేరుగా బ్లాక్ చేయవచ్చని, ఓక వేల పోగొట్టుకున్న వ్యక్తులకు కంప్యుటర్ పరిజ్ఞానం లేనియెడల ప్రతి పోలీస్ స్టేషన్ లో ఒక పోలీసు అధికారిని ఈ సి ఐ ఆర్ హోటల్కి భాద్యతాధికారి గా నియమించడం జరిగినది అని, అతనిని పోలీసు స్టేషన్ కు వెల్లి సంప్రదించిన అతను సి ఈ ఐ ఆర్ పోర్టల్ లో నిక్షిప్తం చేస్తాడు తద్వారా కోల్పోయిన ఫోన్ను తిరిగి పొందే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపారు. ఈ పోర్టల్ ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని మరియు ఎవరన్నా సెకండ్ హ్యాండ్ ఫోన్స్ అమ్మితే కొనవద్దని సూచించారు.