వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం 

వసంత పంచమి రోజున పిల్లలకు అక్షరాభ్యాసం 

 

హనుమకొండ జిల్లా భీమదేరుపల్లి మండలం ములకనూరు గ్రామంలో వసంత పంచమి పర్వదినాన్ని పురస్కరించుకొని గ్రంథాలయంలో సరస్వతి మాతకి ప్రముఖులు పూజలు చేశారు. ఆ తర్వాత ప్రముఖులచే పిల్లలకు అక్షరాభ్యాసం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామంలోని చిన్నపిల్లలను తమ తల్లిదండ్రులు నూతనవస్త్రాలు ధరించి సరస్వతి మాత పూజలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పూజలో పాల్గొన్న పిల్లలకు నూతన పలక బల్పం, పెన్నులు బుక్కులు గ్రంథాలయం వారు అందించారు. ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పిటిసి వంగ రవీందర్, మాజీ సర్పంచ్ మాడుగుల కొమురయ్య, గొల్లపల్లి లక్ష్మయ్య, సరోజన, ఎదులపురం తిరుపతి, వీరేశం, ప్రమోద్ రెడ్డి, అశోక్ ముఖర్జీ, కొలుగూరి రాజు, కాసగోన్ భగత్ సింగ్, శంకర్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment