ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి దీటుగా మౌలిక వసతులు నాణ్యమైన గుణాత్మక విద్య కలెక్టర్

ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి దీటుగా మౌలిక వసతులు నాణ్యమైన గుణాత్మక విద్య కలెక్టర్

 

— జిల్లా పరిషత్ పాఠశాలలో సెగల్ ఫౌండేషన్ 40 లక్షల రూపాయలతో మౌలిక వసతులు కల్పించడం అభినందనీయం కలెక్టర్ 

 

—:ఎస్ ఎస్ సి విద్యార్థులు తప్పని

సరిగా పాఠశాలకు హాజరయ్యే విధంగా తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి 

 

…. జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్

 

శనివారం చేగుంట మండలం వడియారం జిల్లా పరిషత్ పాఠశాలను కలెక్టర్ సందర్శించారు . ముందుగా జిల్లా పరిషత్ పాఠశాల ప్రాంగణాన్ని, త్రాగునీటి సౌకర్యం, మరుగుదొడ్లు, తరగతి గదులు, కిచెన్ డైనింగ్ హాల్స్ ను కలెక్టర్ పరిశీలించారు. తరగతి గదులలో ఉపాధ్యాయుడిగా మారి విద్యార్థినీ విద్యార్థులకు పాఠాలు బోధించి సామర్థ్యాలను పరీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారుఅనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా పరిషత్ పాఠశాల వసతులు కల్పనకు సేగల్ ఫౌండేషన్ వారి సేవలు అభినందనీయమని తెలిపారు తరగతి గదిలో విద్యార్థుల సామర్ధ్యాలను పరిశీలించగా ఆశాజనకంగా ఉన్నాయని, ఎస్ ఎస్ సి లో ఉత్తమ ఫలితాలు తధ్యమన్నారు , పదవ తరగతి చదువుతున్న విద్యార్థినీ, విద్యార్థులను తల్లితండ్రులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలని కోరారు. హాజరు శాతం మెరుగుపడితే దానికి అనుగుణంగా ఫలితాలు ఉంటాయన్నారు. ప్రణాళికమైన ప్రత్యేక తరగతులు, ఫెయిల్ అయ్యే స్టూడెంట్స్ పై ప్రత్యేక శ్రద్ధ, 10/10 సాధించే విద్యార్థుల సంఖ్య పెంపు యావరేజ్, బిలో యావరేజ్ స్టూడెంట్ పై ప్రత్యేక యాక్షన్ ప్లాన్ ద్వారా ప్రణాళికలు రూపొందించడం ద్వారా ఉత్తమ విద్యా బోధన అందిస్తున్నామన్నారు. పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు వారిని ప్రత్యేక శ్రద్ధతో పాఠశాలకు హాజరయ్యే విధంగా చూడాలన్నారు. 

ఈ కార్యక్రమంలో వడియారం జిల్లా పరిషత్ పాఠశాల ప్రధానోపాధ్యాయులు, సంబంధిత ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment