సస్టెన్షన్ లో ఉన్న తాసిల్దార్ నరేష్ అరెస్ట్   చందుర్తి సిఐ జి.వెంకటేశ్వర్లు.

సస్టెన్షన్ లో ఉన్న తాసిల్దార్ నరేష్ అరెస్ట్

 

 

చందుర్తి సిఐ జి.వెంకటేశ్వర్లు.

 

 

 

 

మండలంలోని మల్యాల గ్రామానికి చెందిన సంటి లస్మవ్వ కు గ్రామ శివారులో సర్వే నెంబర్ 322/4/1 లొ ఒక ఎకరం భూమి కలదు.గత 40 సంవత్సరాల నుండి సాగులో ఉన్నారు.భూమి సంబందించిన రైతుబంధు డబ్బులు కూడా వచ్చాయి.గత రైతుబంధు డబ్బులు రాకపోగా, లస్మవ్వ కూతురు ప్రమీల అధికారులను సంప్రదించగా ధరణి పోర్టల్ నందు 40 గుంటలకు బదులు 06 గుంటల స్థలం మాత్రమే చూపించడంతో చందుర్తి రెవెన్యూ కార్యాలయంలో విచారణ చేయగా మిగితా 34 గుంటల వ్యవసాయ భూమిని మల్యాల గ్రామానికి చెందిన గోంటి రాజానర్సు పై అప్పటి తహసీల్దార్ నరేష్ అక్రమంగా 2018-19 లో పట్టా మార్పు చేసినట్లు గుర్తిచింది.దింతో తన తల్లి లస్మవ్వ పేరుపై ఉన్న ఎకరం భూమిని అక్రమంగా పట్టా చేయించుకున్న గొంటి రాజనర్సు,పట్టా మార్పు చేసిన అప్పటి తాసిల్దార్ నరేష్ తో పాటు అధికారులపై చర్యలు తీసుకొని న్యాయం చేయాలని లస్మవ్వ కూతురు సంటి ప్రమీల 27 నవంబర్ 2024 న చేసిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఇప్పటికే మూడు కేసుల్లో ఉండి సస్పెన్షన్ లో ఉన్న తహసీల్దార్ నరేష్ ని అరెస్ట్ చేసి సనివరం రోజున రిమాండ్ కు తరలించడం జరిగిందని,పట్టా మార్పు చేయించుకున్న గుంటి రాజనర్సు మృతి చెందినట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు.నిబంధనలకు విరుద్ధంగా అక్రమంగా పట్టా చేసిన గతంలో చందుర్తి మండల తహసీల్దార్ గా పని చేసి రిటైర్డ్ అయిన ఇద్దరు పై రెండు కేసులు,మరియు నరేష్ పై మూడు కేసులు నమోదు కావడం జరిగిందన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment