సంక్షేమ పథకాలను ప్రారంభించిన అధికారులు

సంక్షేమ పథకాలను ప్రారంభించిన అధికారులు

 

హర్షం వ్యక్తం చేసిన సాయి పెట్ గ్రామస్తులు

 

గణతంత్ర దినోత్సవ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క నాలుగు పథకాలను తెలంగాణ రాష్ట్ర సీఎం రెవంత్ రెడ్డి మరియు మంత్రి దామోదర రాజనర్సింహ ఆదేశానుసారం వట్పల్లి మండలంలోని సాయిపేట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ప్రతాప్ రమేష్ జోషి ఆధ్వర్యంలో నాలుగు పథకాలు అయినటువంటి ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ, రైతు భరోసా, రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో స్పెషల్ ఆఫీసర్ ఏ.డి సత్యనారాయణ మండల ప్రత్యేక అధికారి తహిసిల్దార్ శ్రీనివాస్ రావు, ఎంపీడీఓ శశిప్రభ, వ్యవసాయ శాఖ అధికారి శ్రీనివాస్ రెడ్డి, డిటి శంబీ రెడ్డి, సాయి పేట మాజీ సర్పంచ్ వీరన్న, గోపాల్, విజయ్ కుమార్, నాగరాజు, అడివయ్య, గ్రామ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version