నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళి

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా ఘన నివాళి

 

 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ భారతదేశ స్వాతంత్య సమర యోధుడు, నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను అనే ఆయన నినాదం తో ఆజాద్ హింద్ ఫౌజ్ అనే సైన్యాన్ని స్థాపించారు 

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా దీనబంధు కాలనీ చౌరస్తాలో ఏర్పాటు చేసిన నేతాజీ చిత్రపటానికి బీజేపీ నాయకులు , కార్యకర్తలతో పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించిన బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటేస్టెడ్ ఎమ్మెల్యే,ఇంఛార్జి రవికుమార్ యాదవ్, ఈ సందర్భంగా మాట్లాడుతూ నేతాజీ సుభాష్ చంద్రబోస్ ను స్మరించుకుంటూ ఆయన జరిపిన సాయుధ పోరాటం ద్వారా భారతదేశాన్ని బ్రిటిష్ పాలన నుండి విముక్తి చెయ్యాలని తలచిన వారిలో సుభాష్ చంద్రబోస్ ప్రముఖులని తెలిపారు, అంతేకాకుండా నేతాజీ జన్మదినాన్ని పరక్రమ దివాస్ గా జరుపుకుంటామని తెలుపుతూ, ఆయన జాతీయవాదం మరియు దేశభక్తికి ప్రతీక. ఆయన జీవితం అని గురించి, ఆయన చేసిన పనుల గురించి లేదా ఆయన మరణం గురించి చాలా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని తెలిపారు, ఈ కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షులు వంశీ రెడ్డి, బాలు యాదవ్, రమేష్, బిజవైఎం రాష్ట్ర ఉపాధ్యక్షులు మహేష్, సీనియర్ నాయకులు పర్వతాలు యాదవ్, నర్సింగ్ యాదవ్, గోపాల్ రావు, భూపాల్ రెడ్డి, రాజి రెడ్డి, చారి, నర్సింగ్ రావు,నరేష్,భాస్కర్ రెడ్డి, మురళీ,శ్రీకాంత్ యాదవ్, విజయ్, కళ్యాణ్, లలితా రెడ్డి, మమత, కవిత, రేణుక, బంటీ, పవన్, మరియు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment