కేంద్ర వార్షిక బడ్జెట్ 2025-26: ఏ రంగానికి ఎంతెంత…!
పార్లమెంటులో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్
2025-26 వార్షిక బడ్జెట్ రూ.50,65,345 కోట్లు అని ప్రకటన
రక్షణ రంగానికి అత్యధికంగా రూ.4.91 లక్షల కోట్లు
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎన్డీయే కూటమి సభ్యుల హర్షధ్వనాల మధ్య పార్లమెంటులో వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టారు. రూ.50,65,345 కోట్లతో రికార్డు స్థాయి బడ్జెట్ ను ప్రవేశపెట్టారు.
ఈసారి రక్షణ రంగానికి రూ.4.91 లక్షల కోట్లతో అత్యధిక కేటాయింపులు చేశారు. మారుతున్న ప్రపంచ సమీకరణాలు, సరిహద్దు దేశాలతో వ్యూహాత్మక వైఖరి అవలంబించడం, సరికొత్త ఆయుధాల అభివృద్ధి, సైన్యాన్ని పటిష్టం చేయడం వంటి కారణాల రీత్యా రక్షణ రంగానికి భారీగా కేటాయింపులు చేశారు.
కేటాయింపుల వివరాలు ఇవిగో…
రక్షణ రంగం- రూ.4,91,732 కోట్లు
గ్రామీణాభివృద్ధి- రూ.2,66,817 కోట్లు
హోంశాఖ- రూ.2,33,211 కోట్లు
వ్యవసాయం, అనుబంధ రంగాలు- రూ.1,71,437 కోట్లు
విద్యా రంగం- రూ.1,28,650 కోట్లు
ఆరోగ్య రంగం- రూ.98,311 కోట్లు
పట్టణాభివృద్ధి- రూ.96,777 కోట్లు
ఐటీ, టెలికాం రంగం- రూ.95,298 కోట్లు
ఇంధన రంగం- రూ.81,174 కోట్లు
పారిశ్రామిక, వాణిజ్య రంగాలు- రూ.65,553 కోట్లు
సామాజిక సంక్షేమ రంగం- రూ.60,052 కోట్లు
శాస్త్ర సాంకేతిక రంగం- రూ.55,679 కోట్లు