హైడ్రా తర్వాత లక్ష్యం అదేనా…!
సలకం చెరువులో ఓవైసీ కాలేజీ….?
హైదరాబాద్ (చార్మినార్ ఎక్స్ ప్రెస్)
చెరువుల్లో చేపట్టిన అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్న హైడ్రా తరువాతి లక్ష్యం ఓవైసీ బ్రదర్స్ అంటూ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నది.
సలకం చెరువులో ఓవైసీ కాలేజీ.. హైడ్రా తరువాతి లక్ష్యం అదేనా!
సలకం చెరువు సగం ఆక్రమించి ఫాతిమా విద్యాసంస్థలు
బండ్లగూడ మండలం సలకం చెరువును ఆక్రమించి ఒవైసీ బ్రదర్స్ నిర్మించిన ఫాతిమా విద్యాసంస్థలే హైడ్రా తదుపరి లక్ష్యమని జోరుగా ప్రచారం జరుగుతున్నది. చెరువులో ఆక్రమణలు స్పష్టంగా కనిపిస్తున్నా ఎందుకు కూల్చడం లేదంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. గూగుల్ మ్యాప్ చిత్రాలతో సోషల్మీడియాలో పెట్టిన పోస్టులు వైరల్గా మారాయి.