మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలను గుర్తించండి.

మల్టీలెవెల్ మార్కెటింగ్ మోసాలను గుర్తించండి.

 

గొలుసుకట్టు వ్యాపారాల జోలికి వెళ్ళవద్దు.

 

ఆన్లైన్లో వ్యాపారంలో చేరి మీ కింద ఏజెంట్లను చేర్పించి లాభాలు పొందండి అనే మాయమాటలు నమ్మవద్దు.

 

దీని వెనుక ఆర్థిక నష్టం జరిగే అవకాశం ఉంటుందని గుర్తించండి. అత్యాశకు పోవద్దు.

 

గొలుసుకట్టు వ్యాపారం చేస్తూ ప్రజలను మోసం చేసిన విషమైన పోలీసు చొరవతో జిల్లాలో రెండు కేసులు నమోదు చేశాం.

 

….సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా..

 

గొలుసుకట్టు వ్యాపారాలు చేస్తూ ప్రజలను మోసం చేసే మల్టిలెవెల్ వ్యాపారాలు పెరుగుతున్నాయి. నిత్య సరుకులు, గృహోపకరణాలు, వ్యవసాయ అనుబంధ ఉత్పత్తులు, క్రిప్టో కరెన్సీ మొదలగు వాటి పేర్లు చెప్పి ప్రజలను ఆర్థిక మోసాలకు గురిచేసే మోసాలు ఎక్కువగా జరుగుతున్నాయి. మీ క్రింద ఎక్కువ మంది ఎజెంట్లను చేర్పించి తక్కువ కాలంలో ఎక్కువ లాభాలు పొందండి అనే వాటిని నమ్మవద్దు అని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపిఎస్ గారు అన్నారు. ఇలాంటి మల్టీలెవల్ వ్యాపారం చేస్తూ ప్రజల నుండి డబ్బులు సేకరించి ఆర్దికంగా మోసం చేసిన విషమై పోలీసులు ప్రత్యేక చొరవ తీసుకుని బాధితులను చైతన్య పరిచి ఫిర్యాదులు తీసుకుని జిల్లాలో రెండు కేసులు నమోదు చేశాం అని ఎస్పీ గుర్తుచేశారు. చైన్ సిస్టం మార్కెటింగ్ వ్యాపారాల ద్వారా ఆర్థికపరమైన మోసాలు జరుగుతున్నాయని ప్రజలు గుర్తించాలని కోరారు. ఎక్కువమంది ఏజెంట్లను చేర్పిస్తే రివార్డులు, పాయింట్లు లభిస్తాయని కేటుగాళ్లు ఆశ చూపుతారు. ఇలాంటి వారి మాయమాటలు నమ్మి అత్యాశకు పోతే భారీగా ఆర్థిక నష్టం జరుగుతుంది అన్నారు.

సైబర్ మోసగాళ్ళు కొత్త పద్ధతుల్లో మోసాలకు పాల్పడుతున్నారు. సైబర్ మోసాల పట్ల ప్రజల్లో అవగాహన పెరగడంతో సైబర్ మోసగాళ్లు మల్టీలెవెల్ మార్కెటింగ్ పై దృష్టి సారించి గొలుసుకట్టు వ్యాపారాల పేరుతో వాట్సప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ లాంటి సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రకటనలు చేసి అమాయకులను ఆకర్షించి మోసగించి ఆర్థిక నష్టాన్ని కలగజేస్తారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ ను చాలామంది విదేశాల్లో ఉండి ఒక రాకెట్ లా నడుపుతారు భారీ లాభాలు తోపాటు లగ్జరీ కార్లు ఫారిన్ టూర్ల పేరిట తమ ముఠాలతో అమాయకులకు వలపన్నుతారు అని ఎస్పీ తెలిపారు.అతి తక్కువ కాలంలో అధిక లాభాలు వస్తాయని ఎవరైనా చెప్తే అది మోసమని గ్రహించాలి లేదంటే ప్రజల్ని మాయలోకి దింపి డబ్బులు కొల్లగొడతారు అత్యాశకు పోతే మోసపోవడం ఖాయం. గొలుసుకట్టు మార్కెటింగ్ లో ముందుగా చేరిన వారికి లాభాలు వస్తాయి ఆ తర్వాత చేరిన వారంతా తీవ్రంగా నష్టపోవాల్సిందే. ఇలాంటి నెట్వర్క్ లో ఎవరు చేరొద్దు ఆయా సంస్థల నిర్వాహకులు, కంపెనీలు పెట్టే సభలు, సమావేశాలకు ఎవరు వెళ్ళవద్దు. సోషల్ మీడియాలో వచ్చే అబద్ధపు ప్రకటన పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి, అనుమానాస్పద ప్రకటనలు, వెబ్ లింకులు, ఏపీకె ఫైల్స్ లాంటివి డౌన్లోడ్ చేయవద్దు. మోసపూరిత ప్రకటనలపై, ఆర్థిక మోసాలపై వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నెంబర్ 1930, వాట్సప్ నెంబర్ 8712672222 ద్వారా ఫిర్యాదు చేయండి అని ఎస్పీ తెలిపారు.మోసం జరిగిన వెంటనే ఫిర్యాదు చేస్తే నగదు తిరిగి పొందే అవకాశం ఉంటుంది. జిల్లా లో సైబర్ సెక్యూరిటీ సెల్ నిర్వహిస్తున్నము.డి.ఎస్.పి ఆధ్వర్యంలో జిల్లా సైబర్ సెక్యూరిటీ సిబ్బంది పని చేస్తున్నారు అని అన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version