రోడ్డు భద్రత నియమ నిబంధనలు పాటించాలి
రహదారి భద్రత సమిష్టి బాధ్యత
మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి
మంగళవారం కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హల్ లో రోడ్డు భద్రత కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు పకడ్బందీ చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. వాహనదారులు రోడ్డు భద్రత నియమనిబంధనలు పాటిస్తూ వాహనాలను నడపాలని, అతివేగం వల్ల వాహనాలు అదుపుతప్పి ప్రమాదాలు సంభవిస్తున్నాయన్నారు. జిల్లా ఆరంభం అయ్యే దగ్గరి నుండి ముగింపు ప్రాంతం వరకు
పోలీస్, నేషనల్ హైవే, మున్సిపల్ శాఖలకు చెందిన అధికారులు జాయింట్ ఇన్స్పెక్షన్ ద్వారా ప్రమాదాలు తరుచూ జరుగుతున్న ప్రాంతాలను గత సమావేశాలు చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకొని ప్రమాదాల నివారణకు కృషి చేయాలన్నారు. ద్విచక్ర వాహనం నడిపే వారు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని సూచించారు. ప్రమాదాలు జరిగే ముఖ్య ప్రదేశాలలో ప్రమాద సూచిక లు, మలుపు ల వద్ద స్పీడ్ లిమిట్ సూచికలు తప్పనిసరిగా ఉండాలన్నారు. జిల్లా మీదుగా వెళ్తున్న నేషనల్ హై వే ప్రధాన రహదారి మీద ఎక్కువ గా ప్రమాదాలు జరుగుతున్నాయని, దీని పైన నేషనల్ హైవే అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు రోడ్డు ప్రమాదాల పట్ల కాలేజ్ యాజమాన్యం యువత కి అవగాహన కల్పించాలన్నారు. జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాల నివారణకు పోలీస్ యంత్రాంగం విశేష కృషి చేస్తుందని ట్రాఫిక్ ఉల్లంఘనలకు, డ్రంక్ అండ్ డ్రైవ్ పై తనిఖీలు నిర్వహించి ప్రజల్లో చైతన్యం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటున్నామన్నారు నేషనల్ హైవే, ఆర్ అండ్ బి, పోలీస్, ఇతర శాఖల అధికారుల సమన్వయంతో ప్రజలను రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా పరిరక్షిస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో ఆర్ అండ్ బి ఈఈ సర్దార్ సింగ్, జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, జిల్లా రవాణా శాఖ అధికారి, మెదక్ మున్సిపల్ కమిషనర్, శ్రీనివాస్ రెడ్డి, జిల్లాలోని పోలీస్ యంత్రాంగం తరపున డీఎస్పీలు, సిఐలు, నేషనల్ హైవే, పంచాయతీ రాజ్, ఎలక్ట్రిసిటీ, ఆర్టీసీ అధికారులు పాల్గొన్నారు.