పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం కై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రచారం

పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం కై ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రచారం

 

ప్రభుత్వ విద్యను బలోపితం చేయాలి పి డి ఎస్ యూ

 

ఫిబ్రవరి 4 5 తేదీల్లో భద్రాచలం పట్టణం బత్తుల నగర్(శుభం ఫంక్షన్ హాల్) లో జరిగే పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్ జయప్రదం చేయాలని పి డి యస్ యూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి కాంపాటి పృథ్వీ పిలుపునిచ్చారు. శుక్రవారం భద్రాచలం పట్టణం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కమిటీ ఆధ్వర్యంలో ప్రచార కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి పి డి యస్ యూ భద్రాచలం డివిజన్ కార్యదర్శి మునిగేల శివ ప్రశాంత్ అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రంలో అధికారాన్ని చేజికించుకునేందుకు ప్రతిపక్షంలో ఉండి విద్యార్థుల తరపున గొంతు విప్పిన రేవంత్ రెడ్డి నేడు అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగ బలోపేతానికి ఏమాత్రం కృషి సారించడం లేదనే సత్యాన్ని రాష్ట్రంలో మేధావులు ప్రజాస్వామ్యవాదులు విద్యార్థులు గుర్తించారని వారు అన్నారు. ఎందుకంటే రాష్ట్రంలో గురుకులాలలో వరుసగా ఫుడ్ పాయిజన్ అయి విద్యార్థులు ప్రాణాలు కోల్పోతుంటే అత్యున్నత న్యాయస్థానమే మందలించే స్థితికి మన విద్యా వ్యవస్థ దిగజారిపోయిన స్థితిని ముఖ్యమంత్రి గుర్తించాలని ఆయన తెలిపారు. సంవత్సరాల తరబడి స్కాలర్షిప్స్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల 7500 కోట్లకు పైగా బకాయిలు ఉన్నాయని కాంగ్రెస్ ప్రభుత్వం సంవత్సరం గడిచిన చెల్లించకపోవడం వల్ల పేద బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు పెనుమారంగా మారిందని వారు తెలిపారు. రాష్ట్రంలో ఉన్న విశ్వవిద్యాలయాలకు వైస్ చాన్సర్లను నియమించలేని పరిస్థితి ఉందని,ఖాళీగా ఉన్న ప్రొఫెసర్,టీచింగ్,నాన్ టీచింగ్ పోస్ట్లు భర్తీ చేయడం వదిలేశారని విశ్వవిద్యాలయాలలో కనీసం సౌకర్యాలు లేకుండా నిర్లక్ష్యం వహిస్తూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధిని గాలికి వదిలేసారు అని అన్నారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలో దేశంలో అందరికి సమానమైన,నాణ్యమైన ఉచిత విద్య సాధించడానికి ప్రభుత్వ విద్యారంగా పరిరక్షణ కోసం ఉద్యోగ, ఉపాధి అవకాశాల సాధనకై పి డి యస్ యూ రాజీ లేని పోరాటాల నిర్వహిస్తుందని రాష్ట్రవ్యాప్తంగా విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం నూతన ఒరవిడితో ముందుకు సాగడానికి ప్రగతిశీల విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లడం కోసం పి డి యస్ యూ రాష్ట్ర జనరల్ కౌన్సిల్లో భవిష్యత్తు ఉద్యమ రూపకల్పనలు చేసి విద్యార్థి ఉద్యమాన్ని ముందుకు తీసుకెళుతుందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేష్,స్వాతి,జగదీష్,సతీష్, అస్మిత రూప,వినయ్, బబ్లూ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment