కర్ణాటక రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన

కర్ణాటక రోడ్డు ప్రమాదంపై పవన్ కల్యాణ్ స్పందన

 

సింధనూరు వద్ద వాహనం బోల్తా

నలుగురి మృతి

మృతుల్లో ముగ్గురు వేద విద్యార్థులు

కర్ణాటకలో ఓ వాహనం బోల్తా పడగా… ఏపీకి చెందిన నలుగురు మృత్యువాతపడ్డారు. దీనిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. కర్ణాటకలోని సింధనూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వేద పాఠశాల విద్యార్థులు, ఆ వాహన డ్రైవర్ మృతి చెందడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని వెల్లడించారు. 

కర్నూలు జిల్లా మంత్రాలయంలోని వేద పాఠశాలకు చెందిన విద్యార్థులు హంపిలో ఆరాధనోత్సవానికి వెళుతూ ఈ ప్రమాదానికి గురయ్యారని తెలిసిందని వివరించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని. మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని పవన్ స్పష్టం చేశారు

Join WhatsApp

Join Now

Leave a Comment