పద్మావతి గోదా సామెత వెంకటేశ్వర స్వామి వార్లకు పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గాంధీ

పద్మావతి గోదా సామెత వెంకటేశ్వర స్వామి వార్లకు పట్టువస్త్రాలు తలంబ్రాలు సమర్పించిన ఎమ్మెల్యే గాంధీ

 

 

హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని నిజాంపేట్ రోడ్డు లోని సెవెన్ హిల్స్ కాలనీ లో గల శ్రీ వేంకటేశ్వర స్వామి దేవస్థానంలో పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల వింశ:(20వ) వార్షిక బ్రహ్మోత్సవం సందర్భంగా శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వార్ల దివ్య తిరుకళ్యాణ మహోత్సవం కార్యక్రమం సందర్భంగా శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు ఉప్పలపాటి శ్రీకాంత్ దేవాలయం ఇవో సత్యనారాయణ మరియు భక్తులతో కలిసి స్వామి వారి సమర్పించి ప్రత్యేక పూజలు చేసిన పిఎసి చైర్మన్ ఆరెకపూడి గాంధీ 

 

ఈ సందర్భంగా పిఎసి చైర్మన్ గాంధీ మాట్లాడుతూ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కల్యాణం సందర్భంగా పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలను అందచేయడం చాలా సంతోషంగా ఉంది అని వెంకటేశ్వర స్వామి వారి కృపా కటాక్షాలతో ప్రజలందరు సుఖ సంతోషాలతో ఉండలని, స్వామి వారి కృపా ప్రజలందరి పై ఉంటుంది అని పిఎసి చైర్మన్ గాంధీ తెలియచేశారు.

 

ఈ కార్యక్రమంలో నాయకులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, రాజు, పోతుల రాజేందర్, శ్రీ హరి, పద్మ ,సాంబ శివ రెడ్డి,అప్పిరెడ్డి, కిరణ్ కుమార్, కడియాల శివ ,సుజాత, మరియు భక్తులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment