నేతాజీ సుభాష్ చంద్రబోస్ సేవలు చిరస్మరణీయం.
విహెచ్ పి రాష్ట్ర సహా సంపర్క్ ప్రముఖ రామ్ రెడ్డి.
మెదక్ జిల్లా పెద్ద శంకరంపేట్
స్వాతంత్ర సంగ్రామంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ చేసిన సేవలు చిరస్మరణీయమని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర సహా సంపర్క ప్రముఖ రామ్ రెడ్డి అన్నారు.గురువారం నేతాజీ జయంతి పురస్కరించుకొని పెద్ద శంకరంపేట లోని శ్రీ సరస్వతి శిశు మందిర్ లో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని పేటలోని నేతాజీ విగ్రహానికి పేట ఎస్ఐ శంకర్.మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్. మండల బిజెపి అధ్యక్షుడు కోణం విట్టల్. ఆర్ వి ఎస్ స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు గంగారెడ్డి.శిశు మందిర్ ప్రబంధకారిని సభ్యులు తదితరులు పూలమాలలు వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్ర సంగ్రామ ఉద్యమంలో దేశానికి చేసిన సేవలు చిరస్మరణీయంగా నిలిచిపోయాాయన్నారు. భారతదేశ స్వాతంత్రం కోసం నేతాజీ ఆజాద్ హిందూ ఫౌస్ సంస్థను ఏర్పాటు చేసి దేశ స్వాతంత్రం కోసం పోరాటం చేసిన మహనీయుడని కొనియాడారు. ప్రస్తుత యువత విద్యార్థులు ఆయన సూచించిన మార్గంలో పయనించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యావరణ ప్రముఖ రవి వర్మ.శిశు మందిర్ ప్రబంధ కారిని సభ్యులు జంగం రాఘవులు.బొడ్ల ప్రకాశం. ప్రధానాచార్యులు వీరప్ప.ఆర్ఎస్ఎస్ బాధ్యులు జైహింద్ రెడ్డి. సీతారామారావు. నరసింహ చారి.హరికిషన్. గాండ్ల సంగమేశ్వర్.రాందాస్. బుగుడాల కృష్ణ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.