విద్యార్థులకు మోటివేషనల్ అవగాహన

విద్యార్థులకు మోటివేషనల్ అవగాహన

 

కాగజ్ నగర్ పట్టణంలోని కృష్ణవేణి ఉన్నత పాఠశాలలో ఆదివారం 10వ తరగతి విద్యార్థులకు మోటివేషనల్ క్లాసెస్ ( ప్రేరణ తరగతులు) నిర్వహించబడ్డాయి. విద్యార్థులకు మోటివేషనల్ స్పీకర్ జయసింహ పదవ తరగతి వార్షిక పరీక్షలకు సంబంధించి వారికి అవగాహన కల్పించారు. భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు ఎలా అధిరోహించాలి? జీవితంలో ఎలా స్థిరపడాలి? సమాజంలో తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావడానికి ఎలా కష్టపడాలి..? … తదితర అంశాలపై అవగాహన కల్పించారు. 

*

డ్రీమ్ చార్ట్ లో విద్యార్థి భవిష్యత్తులో ఏమి కావాలనుకుంటున్నాడో దానిని ఉన్నత ధ్యేయంగా పెట్టుకుని ఆ దిశగా అడుగులు వేయాలని చెప్పారు.

*

మీ కల ని బొమ్మ రూపం లో మీకు ఎప్పటికీ కనిపించేలా పెట్టుకుని ప్రేరణ పొందాలని సూచించారు

*

జీరో నుండి హీరో లుగా ఎదిగిన వారిని ఉదహరిస్తూ నేటి యువత సంకల్పిస్తే సాధించలేనిది ఏదీ లేదని చెపుతూ విద్యార్థుల్లో స్పూర్తి ని నింపారు

*

జ్ఞాపక శక్తి ఎలా పెంచుకోవాలో, చిట్కాలతో కొన్ని విషయాలు ఎలా గుర్తుంచుకోవచ్చో నేర్పించారు

*

విజయం సాధించడం లో ఉన్న ఆనందం మరెక్కడా దొరకదన్నారు 

*

ఆశయం, ఆలోచనలు గొప్పగా ఉండాలి. వాటిని బ్లూ ప్రింట్ గా మార్చుకుని ఆ దిశగా అడుగులు వేయాలి

*

నచ్చిన వాహనం, గొప్ప ఇల్లు, విలువ కలిగిన స్థానం, ఇష్టమైన ప్రొఫెషన్, మంచి సంపాదన ఇలా అన్నీ పొందాలనే సంకల్పంతో ముందుకు సాగాలి. వీటిని సాధించే దిశలో చదువు యొక్క ప్రాముఖ్యత గుర్తించాలి.

గొప్ప వాళ్లుగా ఎదుగుతూ ఈ సమాజానికి మీ వంతు తోడ్పాటు కూడా అందించాలి.

*

ఒక మామూలు ప్రయాణానికే మనం ఎన్నో ప్రణాళిక లు వేసుకుంటాం. అలాంటిది మరి మన జీవన ప్రయాణానికి ఎంతో మంచి ప్రణాళికలు వేసుకోవాలి కదా?

*

యుద్ధానికి ముందే ఓటమి అంగీకరించకూడదు. మొదటి స్థానము నాదే అని నమ్మి ఆ దిశగా కష్టపడాలి.

నీ ఆశయం ఉన్నతంగా ఉన్నప్పుడు, నీ కార్యాచరణ కూడా ఉన్నతంగానే ఉండాలి.

*

విద్యార్థులతో ఆడించిన నంబర్ మెమరీ గేమ్ పిల్లలని ఎంతగానో ఆకట్టుకుంది.

పిల్లలు కూడా ఉత్సాహంగ మెమరీ గేమ్ లో పాల్గొన్నారు

 

ఈ కార్యక్రమంలో పాఠశాల కరెస్పాండెంట్ సురవర్ధన్, డైరెక్టర్ జియా ఉల్ హక్ మరియు డైరెక్టర్ వేద ప్రవీణ్, ఉపాద్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment