పన్నూరు గ్రామంలో తల్లి పాల వారోత్సవాలు

రామగిరి మండలంలోని పన్నూర్ గ్రామంలో అంగన్వాడి టీచర్ రాజ్యలక్ష్మి  ఆధ్వర్యంలో   తల్లిపాల వారోత్సవాలు నిర్వహించడం జరిగింది. గర్భిణీ స్త్రీలకు, తల్లికి మొదటగా వచ్చే ముర్రుపాల ప్రాముఖ్యతను గురించి వివరించడం జరిగింది. కేవలం తల్లిపాలు 6 నెలల వరకు ఇవ్వాలనీ అనుబంధ ఆహారం ఇస్తూ తల్లిపాలను రెండు సంవత్సరముల వరకు కొనసాగించాలని వివరించడం జరిగింది. పిల్లల పెరుగుదలపై ప్రత్యేక శుద్ధ వహించాలని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆరు నెలల నుండి బాబుకు అన్న ప్రసన్న కార్యక్రమం, గర్భిణీల బరువులు, ఎత్తులు చూడడం జరిగింది.ఈ కార్యక్రమంలో  స్పెషల్ ఆఫీసర్ రమేష్, సెక్రటరీ ప్రేమలత, ఎంపీపీ ఎస్ హెచ్ ఎం కవిత, ఏఎన్ఎం శారద, ఆశా శిరీష,వివో అధ్యక్షురాలు శిరీష, గర్భిణీలు,బాలింతలు పాల్గొనడం జరిగింది. ఇందులో భాగంగా అన్నప్రాసన అక్షరాభ్యాసం కార్యక్రమాలు కూడా నిర్వహించడం జరిగింది.

 

Join WhatsApp

Join Now

Leave a Comment