శిక్షణ పొందిన అభ్యర్థులకు పోస్టింగ్ ఉత్తర్వుల అందజేత

అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియాలోని ఎం.వి.టి.సి. లో 48 రోజుల శిక్షణ పూర్తయిన 15 మంది డిపెండెంట్లకు మంగళవారం జి.ఎం. కార్యాలయంనందు నిర్వహించిన కార్యక్రమంలో  అడ్రియాల ప్రాజెక్ట్ ఏరియా జనరల్ మేనేజర్  కొప్పుల వేంకటేశ్వర్లు పోస్టింగ్ ఉత్తర్వులను అందజేశారు.  ఈ సందర్భంగా వారిని ఉద్దేశించి మాట్లాడుతూ ఉన్నత చదువులు చదివినప్పటికీ ప్రభుత్వ ఉద్యోగానికి ఉన్న ప్రాధాన్యతను గుర్తించి సింగరేణి సంస్థలో బదిలీ వర్కర్ ఉద్యోగంలో చేరుతున్నారని, అయితే ఆ స్థాయికి తగ్గట్టుగా పని చేస్తూ, అధికారులు, సూపర్ వైజర్ల ఆదేశాలను పాటిస్తూ అనుక్షణం అప్రమత్తంగా ఉంటూ, భద్రతతో విధులు నిర్వహించాలని కోరారు. సింగరేణి సంస్థలో ఉద్యోగం రావడం ఒక వరం లాంటిదని, చెడు అలవాట్లకు బానిసై విధులకు గైర్హాజరు కావద్దని, సీనియర్ ఉద్యోగుల దగ్గర క్రమశిక్షణతో పని నేర్చుకొని, కలిసి కట్టుగా పనిచేసి మున్ముందు మంచి పదోన్నతులు సాధించి కుటుంబం తో పాటు సంస్థ అభివృద్ధికి తోడ్పడాలని అన్నారు.ఈ కార్యక్రమంలో  ఏరియా ఇంజినీర్ కె.యాదయ్య, ఎస్ వో టు జి ఎం బి. సత్య నారాయణ, పర్సనల్ విభాగాధిపతి బి.సుదర్శనం, అధికారులు కె .చంద్రశేఖర్, పి.డి.సుధాకర్, మల్లన్న తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment