మంథని నియోజకవర్గం నుంచి కాలి నడక ద్వారా శబరిమల కు మహా పాదయాత్ర గా బయల్దేరిన అయ్యప్ప స్వాముల బృందం పాదయాత్ర ద్వారా పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటూ ఆఖరిగా శబరిమల చేరుకొని తమ మొక్కులు సమర్పించుకొనున్నారు.5వ రోజు శనిగారం వద్ద వారిని కలిసి వారికీ మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు తోట్ల తిరుపతి యాదవ్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు అన్వర్, రామగిరి మండలం కాంగ్రెస్ అధ్యక్షులు రొడ్డ బాపు వారికీ తాగు సూచనలు సలహాలు ఇవ్వడం జరిగింది.ఈ పాదయాత్ర లో గురు కన్నె స్వామి రాజా సంపత్( రత్నాపూర్ ), గురు స్వామి ఎడ్ల రమేష్ ( మంథని ),కోటేష్ ( డిప్యూటీ ఎం ఆర్ ఓ ),తోట్ల ప్రసాద్ యాదవ్ ( బేగంపేట్ x రోడ్ ),జంబోజ్ సాయి ( మంథని ),జంబోజు శరత్ (మంథని ) పాల్గొంటున్నారు.