మేనత్తల పసుపు కుంకుమ భూమిపై కన్నేసిన మేనకోడలు.

  • మేనత్తల పసుపు కుంకుమ భూమిపై కన్నేసిన మేనకోడలు.

    -కబ్జాకు విశ్వ ప్రయత్నాలు.

     -నకిలీ పత్రాలు సృష్టించి మరి కబ్జాకియత్నం.

     -ఆర్టిఏ సమాచారంతో నకిలీ పత్రాలు తేలి మహిళపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు.

     -అయినా మారని తీరు.

     -మరల భూమి మీదకు వచ్చి నా భూమి అంటూదౌర్జన్యం చేస్తున్న వైనం.

    బయ్యారం:చార్మినార్ ఎక్స్ ప్రెస్.

    నకిలీ దస్తావేజులతో రెండెకరాల 10 గుంటలు మేనత్తల పసుపు కుంకుమ భూమిని కొట్టేయాలని చూసిన మేనకోడలు సంతులల్ పొడ్ తండాలో చోటు చేసుకున్న ఘటన. వృద్ధ బాధితురాలు దంచనాల చంద్రకళ, సూర్యకళ ఇచ్చిన వివరాలు ప్రకారం. మా తల్లి కాంతమ్మకి తన తండ్రి దంచనాల చంద్రయ్య 1965 సంవత్సరం పసుపు కుంకుమ కింద రెండు ఎకరాల 10 గుంటలు వ్యవసాయ భూమి సింగారం గ్రామంలో సర్వేనెంబర్ 190/1/అ/1 నందు 0:36 గుంటలు, 190/1/అ/2 నందు 0:23 గుంటలు భూమి , గంధం పల్లి గ్రామం సర్వేనెంబర్ 27/ఇ/2 నందు 1:10 గుంతల వ్యవసాయము పసుపు కుంకుమ కింద ఇచ్చినారు . మా తల్లి గారి తదనంతరం ఆ భూమిని మా అన్నయ్య సుదర్శన చారితో మా ముగ్గురు అక్కచెల్లెలం కలిసి సాగు చేసుకుంటున్నాం. 2018 సంవత్సరం మా అన్నయ్య మరణించినాడు. అట్టి భూమిని ఎట్లయినా తన సొంతం చేసుకోవాలని కుట్రపూరితమైన ఉద్దేశంతో 2021 వ సంవత్సరం మోసపూరిత పన్నాగం పన్ని మా మేనకోడలు జవ్వాజి మధురవాణి తన దగ్గర ఆ భూమికి సంబంధించి ఎటువంటి దస్తావేజులు లేకుండా భద్రాచలం మొబైల్ కోర్టు నందు కోర్టును సైతం మోసం చేసి సృష్టించిన మరియు నకిలీ వీలునామా అనే జిరాక్స్ దస్తావేజులు తన సుదర్శన చారి సంతకాన్ని కాని సైతం ఫోర్జరీ చేసి తాను సృష్టించిన దస్తావేజుతో ఇంజక్షన్ ఆర్డర్ పొంది తద్వారా ఆ భూమిని అమ్మి సొమ్ము చేసుకోవాలనే ప్రయత్నం చేసింది. కానీ అన్నయ్య సతీష్ కుమార్ ఆ వీరనామ జ్యూడిష స్టాంప్ పేపర్ లపై ఆర్టిఏ కి సమాచారం కోరగా అవి బ్యాక్ డేట్ లో కొన్నవని డిస్టిక్ రిజిస్టర్ ఇచ్చిన సమాచారంతో సదరు మహిళపై బయ్యారం పోలీస్ స్టేషన్లో 11/4/2022 న 51/2022 పలు సెక్షన్ల కింద ఎఫ్ ఐ ఆర్. సి.సి 275/2023 చార్జిషీట్ వేయడం జరిగింది. అయినా మేనకోడలు జవ్వాజి మధురవాణి లో ఎటువంటి మార్పు రాలేదు మళ్ళీ సోమవారం భూమ్మీదకి వచ్చి మేనత్తల మైన మాపై దౌర్జన్యం చేసి ఆ భూమి నాది అంటూ మమ్మల్ని భూమిలోకి రానీయకుండా వ్యవసాయ పనులు చేసుకోకుండా అడ్డుపడి మాకు ఆర్థికంగా కూడా నష్టం వచ్చేలా వ్యవహరిస్తుంది. కోర్టులో వాళ్ళు వేసిన తప్పుడు ఇంజక్షన్ ఆర్డర్ ని కోర్టు ది.19/8/2021 న వేకేట్ చేయడం కూడా జరిగింది. అప్పటినుండి మా స్వాధీన అనుభవంలో ఉన్నటువంటి భూమిని ఎలాగైనా కబ్జా చేయాలని మరల ప్రయత్నం చేస్తుంది. మేనత్తల్లో ఒకరైన చంద్రకళవతికి అసలే హార్ట్ పేషెంట్ ఇటీవలే ఆమెకు బైపాస్ ఆపరేషన్ జరిగిందనీ కోర్టు ద్వారా మాకు క్లియరెన్స్ వచ్చిన తనపై పలు సెక్షన్ల కింద క్రిమినల్ కేసు నమోదైన కేసు నమోదు అయినా మా భూమి లోకి మమ్మల్ని పోనీయకుండా అడ్డుపడుతుంది. ఆ భూమికి సంబంధించి అన్ని రకాల హత్తు పత్రాలు మా దగ్గర ఉన్న కోర్టు ఉత్తర్వులు ఉన్న తాను అడ్డుకుంటుందని న్యాయం కోసం మేము ఎవరిని ఆశ్రయించాలి అని వృద్ధురాలు చంద్రకళ కన్నీరు మున్నూరు అవుతున్నారు.జరిగిన విషయాన్ని బయ్యారం పోలీస్ స్టేషన్ నందు సోమవారం ఫిర్యాదు చేసి మా మేనకోడలను చట్టరీత్యా శిక్షించాలని కోరుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment