హ్యూమన్ రైట్స్ కౌన్సిలింగ్ ఫర్ ఇండియా హెచ్ ఆర్ సి ఐ పెద్దపెల్లి జిల్లా అధ్యక్షునిగా కొండల రాజేందర్ కుమార్ ని నియమించడం జరిగింది అని హెచ్ ఆర్ సి ఐ నేషనల్ చెర్మన్ చెన్నూపాటి శ్రీకాంత్ మరియు నేషనల్ జనరల్ సెక్రటరీ నందం నర్సిములు మరియు అడిష్ణల్ జనరల్ సెక్రటరీ మాదాసు చారేంద్ర ఉత్తర్వులు జరిచేయడం జరిగింది. ఈ సందర్భంగాకొండల రాజేందర్ కుమార్ మాట్లాడుతూ సమస్య మీది పరిష్కారం మాది అంటూ దళిత, పిడిత, పేద బలహీన ప్రజల అణగారిన కులాల వారికీ అగ్రవర్ణ కులాలలో ఉండబడే పేద ప్రజలకు విక్రమార్కుడిలా పనిచేస్తానన్నారు. మానవహక్కుల ఉల్లంఘణ లేని సమాజం కోసం అహర్నిశలు కష్టపడతానన్నారు.ఏంతటివారైనా వారు ఏ హోదాలో వున్నా కూడా అన్యాయం జరిగితే సహించేదిలేదన్నారు.మానవహక్కుల ఉల్లంఘణ జరిగితే న్యాయపోరాటం చేస్తానని హామీయిచ్చారు. అవినీతి లేని సమాజన్ని చూడాలనీ ఆశిస్తున్నాను అన్నారు. అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ప్రజలను చైతన్యం చేయడం కోసం అహర్నిశలు కష్టపడతానని, ప్రజా సమస్యల పట్ల బాధ్యతతో పనిచేస్తానని, నా నియామకానికి సహకరించిన జాతీయస్థాయి నాయకులకు మరియు స్టేట్ మరియు డిస్టిక్ నాయకులకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను అని అన్నారు.
హెచ్ ఆర్ సి ఐ జిల్లా అధ్యక్షునిగా కొండల రాజేందర్ కుమార్ నియామకం
Updated On: October 19, 2024 7:12 pm