Latest-News

Latest News

147b9475 3893 405c 8b21 61dc7dba8936

శేరిలింగంపల్లి జోన్ వ్యాప్తంగా చైన్మెన్ ల బదిలీలు…జెడ్సీ ఉపేందర్ రెడ్డి

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 21* శేరిలింగంపల్లి సర్కిల్ లో : ఏండ్ల తరబడి ఒకే సర్కిల్‌లో పాతుకుపోయిన పట్టణ ప్రణాళికా విభాగం చైన్‌మన్లకు స్థాన చలనం కలిగింది. అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలకు ఉపక్రమించిన శేరిలింగంపల్లి జోనల్‌ అధికారులు ఆ మేరకు క్షేత్రస్థాయిలో దిద్దుబాటు చర్యలను ప్రారంభించారు. ఈ మేరకు శేరిలింగంపల్లి జోన్‌ వ్యాప్తంగా సర్కిళ్లలో పట్టణ ప్రణాళికా విభాగంలో పని చేస్తున్న చైన్‌మన్‌లను బదిలీ చేస్తూ జోనల్‌ అధికారులు సోమవారం ఆదేశాలు చేసారు . ఆయా సర్కిళ్ల డీసీల నుంచి వచ్చిన చైన్‌మన్‌ల పనితీరు నివేదికల ఆధారంగా ఈ బదిలీలను చేసారు. ఇందులో శేరిలింగంపల్లి సర్కిల్‌లో పని చేస్తున్న చైన్‌మన్‌లలో లక్ష్మీనారాయణను యూసుఫ్‌గూడ సర్కిల్‌కు , జావీద్‌ను చందానగర్‌ సర్కిల్‌కు బదిలీ చేసారు. చందానగర్‌ సర్కిల్‌లో పని చేస్తున్న ఐలయ్యను శేరిలింగంపల్లి సర్కిల్ కి కుమారస్వామిలను పటాన్‌ చెరు సర్కిల్‌కు బదిలీ చేసారు. కాగా పటాన్‌ చెరు సర్కిల్‌లో పని చేస్తున్న మల్లేష్‌ను శేరిలింగంపల్లి సర్కిల్‌కు , రాజేందర్‌ను చందానగర్‌ సర్కిల్‌కు బదిలీ చేసారు. చందానగర్‌ సర్కిల్‌ కార్యాలయంలో కంప్యూటర్‌ ఆపరేటర్‌ ప్రవీణ్‌కుమార్‌( గడ్డం శ్రీను)ను పటాన్‌ చెరు సర్కిల్‌కు బదిలీ చేసారు. వీరందరినీ తక్షణమే రిలీవ్‌ చేయాలని జోనల్‌ కమీషనర్‌ ఉపేందర్‌రెడ్డి తన ఆదేశాలలో పేర్కొన్నారు. జోన్ వ్యాప్తంగా నాక్ ఇంజనీర్లను సైతం బదిలీ చేసినట్లు జోనల్ కమిషనర్ తెలిపారు…కాగా సోమవారం సాయంత్రం కొందరు చైన్‌మన్‌లు తమకే కేటాయించిన కొత్త సర్కిళ్లలో రిపోర్ట్ చేసారు.
IMG 20241021 WA0466

అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రత……

అమరవీరుల స్ఫూర్తితో శాంతి భద్రత…… శాంతిభద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి-తూప్రాన్ డిఎస్పి వెంకట్ రెడ్డి పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం అమరులైన పోలీసులకు నివాళి చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 21 ప్రతినిధి మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పోలీస్ సంస్కరణ దినోత్సవం జరుపుకున్నారు స్థానిక డిఎస్పి వెంకట్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీస్ సంస్కరణ దినోత్సవం నర్సాపూర్ చౌరస్తా అమరులైన మాజీ డిఎస్పి పూలమాలలు వేసి సంస్కరణ దినోత్సవం జరుపుకున్నారు వారు మాట్లాడుతూ శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం అభివృద్ధి ఊరు బాగుంటుందని పోలీసుల ప్రజల మధ్య సమన్వయంతో ఉంటే శాంతి భద్రతలకు తోడ్పడుతుందని కొనియాడారు వారి వెంట తూప్రాన్ ఎస్ఐ శివానందన్ పోలీస్ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు
IMG 20241021 120610 scaled

స్కాలర్ షిప్ లు ప్రభుత్వం బిక్ష కాదు విద్యార్థుల హక్కు……

స్కాలర్ షిప్ లు ప్రభుత్వం బిక్ష కాదు – విద్యార్థుల హక్కు…… పెండింగ్ లో ఉన్న ₹ 7500 కోట్ల స్కాలర్షిప్స్, ఫీజు టీవీరియంబర్స్మెంట్ బకాయిలు వెంటనే విడుదల చేయాలి – ఎబివిపి రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బండారి ప్రశాంత్ తూప్రాన్ పట్టణ కేంద్రంలో ఏబీవీపీ ఆధ్వర్యంలో విద్యార్థులతో ర్యాలీ చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 21 ప్రతినిధి తెలంగాణ రాష్ట్రంలో పాలకులు మారిన ప్రజల బ్రతుకులు మారడం లేదని గత పాలకులు విద్యారంగాన్ని పూర్తిగా విధ్వంసం చేశారు. ప్రస్తుత ప్రభుత్వం సైతం విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ మరింత విధ్వంసం చేస్తుందని . స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తున్న విద్యారంగానికి బడ్జెట్ కనీస నిధులు కేటాహించకుండా గతం కంటే తక్కువ (6.5%) కేటాయించడం అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి విద్యారంగంపై ఎంత చిత్తశుద్ధి ఉందో అవగతం అవుతుంది. పేద, మధ్య తరగతి విద్యార్థుల ఉన్నత చదువు కోసం సంజీవని లాంటి ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాన్ని ఈ ప్రభుత్వం తూట్లుపొడిచే ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. గత మూడు సంవత్సరాలుగా దాదాపు రూ.7500 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పెండింగ్లో ఉన్నా ఈ ప్రభుత్వం ఏమీపట్టనట్లు వ్యవహరిస్తున్న తీరును ఏబీవీపీ తీవ్రంగా పరిగణిస్తున్నాయి. రాష్ట్రంలో స్కాలర్షిప్స్, రీయింబర్స్మెంట్ పై ఆధారపడి దాదాపు 15 లక్షల మందికి పైగా విద్యను అభ్యసిస్తున్నారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం స్కాలర్షిప్స్ ఇవ్వకుండా. ఫీజు రీయింబర్స్ చేయకుండా పేద విద్యార్థుల జీవితాలను అంధకారంలోకి నెట్టే కుట్ర చేస్త్నుది. పేద విద్యార్థులపై ప్రభుత్వ కుట్రలు ఆపి వెంటనే పెండింగ్లో ఉన్న 7500 కోట్ల ఫీజు రీయింబర్స్ మెంట్, స్కాలర్షిప్లను విడుదల చేయాలనీ ఏబివిపి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాయి. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కార్యకర్తలు కార్తీక్.ఎల్లం.అబు సాయికిరణ్.అనిల్ .తదితరులు పాల్గొన్నారు
IMG 20241021 WA0013

రైతు భరోసా రైతులందరికీ వేయాలి

రైతు భరోసా రైతులందరికీ వేయాలి రైతులకు ఇచ్చిన హామీలు విస్మరించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి షరతులు లేకుండా రైతులందరికీ రుణమాఫీ చేయాలి వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ సర్కారు చర్యలు నిరసిస్తూ బిఆర్ఎస్ నిరసన భద్రాచలం.తెలంగాణ రైతాంగానికి కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన రైతు హామీలు నెరవేర్చాలని వానాకాలం రైతు భరోసా ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలకు నిరసనగా బిఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ఫ్లకార్డులు చేతపట్టి స్థానిక అంబేద్కర్ సెంటర్లో నిరసన వ్యక్తం చేశారు.ఈ సందర్భంగా బిఆర్ఎస్ మండల పార్టీ నాయకులు ఆకోజు సునీల్ కుమార్ మాట్లాడుతూ* రైతాంగ వ్యతిరేక చర్యలు చేపడుతున్న కాంగ్రెస్ ద్వంద వైఖరి నశించాలని.. ఎన్నికల్లో సీట్ల కోసం రైతులకు రైతు కూలీలకు కౌలు రైతులకు రైతు భరోసా ఇస్తామని . బిఆర్ఎస్ ప్రభుత్వం 8000 ఇస్తున్నది. మేము 15000 ఇస్తామని మాయమాటలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం నేడు రైతు భరోసా రైతులకు ఎగబట్టి పెట్టుబడి సాయం మరిచి రైతులతో చెలగాటమాడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వం నిరంకుశ విధానo నశించాలని తెలిపారు.ఆరు గ్యారెంటీలతో మహిళలకు మాయ మాటలతో గద్దెనీకిన కాంగ్రెస్ ప్రభుత్వం హామీలు విస్మరించిందని ఎటువంటి సరదాలు లేకుండా రైతులకు రుణమాఫీ రైతులకు రైతు భరోసా రైతులకు ఎటువంటి సేవలు లేకుండా రైతు బీమా 24 గంటల వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అందించాలని లేకపోతే రైతాంగ పోరాటం మరింత బలపడి కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పోరాటంలో కొట్టుకపోవడం ఖాయమని తెలిపారు.ఈ కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు పార్టీ పడిసిరి శ్రీనివాస్. సీనియర్ నాయకులు బిరబోయిన వెంకట నరసమ్మ. అయినాల రామకృష్ణ .కోలా రాజు .గుంజా ఏడుకొండలు. తూటిక ప్రకాష్. కాపుల సూరిబాబు. బత్తుల నరసింహులు. పసుపులేటి రమేష్ .గోసుల శ్రీనివాస్. రాజుదేవర నాగరాజు.బడిశా నాగరాజు. కావూరి సీతామహాలక్ష్మి పూజల లక్ష్మి .నరసమ్మ .తేల్లం రాణి. సుశీలమ్మ. సలోమి.సలీమా.ప్రియాంక .తదితరులు పాల్గొన్నారు.
IMG 20240929 WA0149

జర్నలిస్టు సుదర్శన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.- బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి.

జర్నలిస్టు సుదర్శన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.– బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి. బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బయ్యారం ప్రెస్ క్లబ్ ప్రెస సుమన్ రెడ్డి డిమాండ్ చేశారు.ఇల్లందు మండలంలో ఆదాబ్ హైదరాబాద్ అనే దినపత్రిక రిపోర్టర్ గా పనిచేస్తున్న నిట్ట సుదర్శన్ పై శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టడం జరిగిందని ఈ దాడిని బయ్యారం ప్రెస్ క్లబ్ మెంబెర్స్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుపై దాడి చేసిన వాళ్లందరిని అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుమన్ రెడ్డి డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు వార్తల సేకరణ కోసం ఎక్కడికి వెళ్లినా కావాలని కేసులు పెట్టి వేధిస్తున్నారని,అవినీతిని ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారనీ,సంఘంలో జరుగుతున్న అవినీతిని బయటికి తీసే జర్నలిస్టులపై ఎదురు దాడి చేస్తూ,కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు.
IMG 20241018 WA0188 scaled

గ్రామ శుభ్రతనే మా ఆరోగ్యం…

*డ్రై డే – ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా సత్వర్ గ్రామాన్ని సందర్శించిన అధికారులు* జహీరాబాద్ నియోజకవర్గం చార్మినార్ ఎక్స్ ప్రెస్ ప్రతినిధి అక్టోబర్ 18 ఈరోజు, డ్రై డే – ఫ్రైడే కార్యక్రమం కింద, మండల ప్రత్యేక అధికారి బిక్షపతి మరియు మండల అభివృద్ధి అధికారి మహేందర్ రెడ్డి సత్వర్ గ్రామాన్ని సందర్శించారు. ఈ సందర్శనలో వారు పాఠశాల మరియు అంగన్వాడి పాఠశాలలను తనిఖీ చేశారు.అదేవిధంగా, గ్రామంలోని పారిశుద్ధ్యాన్ని పరిశీలించారు మరియు కార్యదర్శికి తగు సూచనలు ఇచ్చారు. ఈ చర్యలు గ్రామంలో ఆరోగ్య మరియు పరిశుభ్రత ప్రమాణాలను మెరుగుపరచడంలో సహాయపడే నిమిత్తం తీసుకోవడం జరిగింది.
IMG 20241020 WA0308

సామాజిక కార్యకర్తకు ఆరుదైన గౌరవం….

జానకిరామ్ కు అరుదైన డాక్టరేట్ గౌరవ పురస్కారం….. యు.ఎస్. ఏ బార్కెల్ లోని తియోలాజికల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దీపక్ ఫెడ్రిడ్ చేతులమీదుగా సామాజిక సేవలో గుర్తించి డాక్టరేట్ పురస్కారం డాక్టర్ దీపక్ ఫిడ్రిడ్, డాక్టర్ వెంకటస్వామి ల చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ జానకిరామ్ చార్మినార్ ఎక్స్ ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 20 ప్రతినిధి మానవతావాది, అందరి ఆత్మీయుడు, ప్రేమస్వరూపుడు, ప్రముఖ సమాజ సేవకుడు తూప్రాన్ ముద్దుబిడ్డ జానకిరామ్ కు అరుదైన డాక్టరేట్ గౌరవ పురస్కారం ను అమెరికా బర్కెల్ లోని తియోలాజికల్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ దీపక్ ఫెడ్రిడ్ చేతులమీదుగా సామాజిక సేవను గుర్తించి డాక్టరేట్ పురస్కారంను ఆదివారం సాయంత్రం నిర్వహించిన కార్యక్రమంలో ప్రధానం చేశారు. ఈ సందర్భంగా వైస్ ఛాన్సలర్ డాక్టర్ దీపక్ ఫిడ్రిడ్, డాక్టర్ వెంకటస్వామి ల చేతుల మీదుగా అందుకున్న డాక్టర్ జానకిరామ్ మాట్లాడుతూ తాను ఈ రోజు నా జీవితంలో మరువలేనిది, ఇది ఒక గొప్ప సువర్ణ అవకాశం అని అన్నారు. ఇందుకు ప్రోత్సహించిన డాక్టర్ వెంకట స్వామి గారికి, డాక్టరేట్ ప్రదానం చేసిన డాక్టర్ దీపక్ ఫీడ్రిడ్ లకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ దీపక్ ఫెడ్రిడ్ మాట్లాడుతూ గౌరవ డాక్టరేట్ ఒక నిర్దిష్ట రంగానికి, సమాజానికి విశిష్ట సేవలు అందించి, సమాజంలో మంచి గుర్తింపు తెచ్చుకున్న మహనీయుని తెలిపారు. ఆయన అందించిన సహకారాన్ని గౌరవించే మార్గంగా డాక్టరేట్ ను జానకిరామ్ గారికి ఇవ్వబడిందనీ తెలిపారు. గౌరవ డాక్టరేట్‌ గ్రహీత జానకిరామ్ చేసిన సమాజ సేవకు గుర్తింపుగా అధికారికంగా అందించ బడిందన్నారు. ఉన్నత విద్యా అర్హతను కలిగిఉన్నారు. స్టింగర్ గా, మండల రిపోర్టర్ గా, తాలూకా రిపోర్టర్ గా, స్టాఫ్ రిపోర్టర్ గా, ప్రధాన సంపాదకులుగా, ఎడిటర్ గా, సి.ఈ.ఓ గా అంచలంచలుగా ఒక్కో మెట్టు ఎక్కుతూ ఓ దిన పత్రిక కు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ జానకిరామ్ అన్ని రంగాల్లో రాణించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ లో స్వయం సేవక్ గా, ఘట నాయకునిగా, ముఖ్య శిక్షక్ గా, ఓ.టి.సి ప్రథమ వర్ష పూర్తి చేసి సమాజ నిర్మాణానికి కృషి చేశారు. అంతే కాకుండా ప్రముఖ ఇంటర్ నేషనల్ లయన్స్ క్లబ్ లో చేరి క్లబ్ ప్రెసిడెంట్ గా, జోన్ చైర్మన్ గా, డిస్ట్రిక్ట్ చైర్మన్ గా వేల సంఖ్యలో సేవా కార్యక్రమాలు చేపట్టారనీ తెలిపారు. కరోనా సమయంలో నిరుపేదలకు నిత్యావసర వస్తువులు, మాస్క్ లు, మందులు అందించిన సేవాతత్పరుడన్నారు. కరోనా సమయంలో జాతీయ రహదారి బైపాస్ రోడ్డు గుండా కాలి నడకన వెళుతున్న వారికి కాళ్ళకు బొబ్బలు రావడం తో చెల్లించి 500 పాదరక్షలు (చెప్పులు) పంపిణీ చేశారు. ఆకలి తో అలమిటించిన వారి ఆకలి తీర్చడానికి భోజనం, పులిహోర ప్యాకిట్లు, త్రాగు నీటి సౌకర్యంతో పాటు ఉచిత వైద్య సేవలు అందించి సమాజంలో మంచి పేరు …

Read more

IMG 20241020 WA0131 scaled

మక్కా మసీదులోజల్సా వాల్ పోస్టర్ విడుదల……..

మక్కా మసీదులోజల్సా వాల్ పోస్టర్ విడుదల…….. చార్మినార్ ఎక్స్ ప్రెస్ 20 అక్టోబర్ కొడంగల్:—- వికారాబాద్ జిల్లా కొడంగల్ మక్కా మసీదులో జల్సా వాల్పోస్టర్ను ఆవిష్కరించారు అక్టోబర్ 21న కోస్గి మదీనా మజీద్ లో కొడంగల్ మాజీ ఉపసర్పంచ్ ఆధ్వర్యంలో ఆవిష్కరించే జల్సా పోస్టర్ అందరూ హాజరుకావాలని కోరారు. ఈ కార్యక్రమంలో అబ్దుల్లా ఖాన్ షేక్ ఆదిల్ ఖలీద్ యూసుఫ్ సలీం తదితరులు పాల్గొన్నారు
IMG 20241020 WA0181

రైతు భరోసా కు నిధులు నిల్. రైతులకు  పెట్టుబడి సహాయం అందించలేదని బిఆర్ఎస్ నాయకుల రాస్థారోకో. -మండల అధ్యక్షుడు తాత గణేష్.

రైతు భరోసా కు నిధులు నిల్. రైతులకు  పెట్టుబడి సహాయం అందించలేదని బిఆర్ఎస్ నాయకుల రాస్థారోకో. -మండల అధ్యక్షుడు తాత గణేష్.   తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీ ఇస్తామని మాయ మాటలతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు తాత గణేష్ అన్నారు.మండల కేంద్రంలోని బస్టాండ్ సెంటర్లో బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ పిలుపు మేరకు రైతులకు రైతు భరోసా పై కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేసిందని పార్టీ శ్రేణులు రాస్తారోకో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు గణేష్  మాట్లాడుతూ కేసిఆర్ ప్రభుత్వం హాయంలో ఎన్ని ఇబ్బందులు ఉన్నా రైతులకు రైతు బంధు అమలు చేశామని తెలిపారు.పెట్టు బడి కోసం రైతులకు సహాయం ఎందుకు చేయలేదని విమర్శించారు.ఆరు గ్యారంటీల అమలు చేస్థామని అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి మాటలు మొండి చేయి చూపుతున్నారని ఆరోపించారు.ఆరు గ్యారెంటీ లు అమలు చేయాలని ,లేని పక్షంలో బిఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన నిలబడి పోరాటం చేస్థుందని తెలిపారు.రైతు భరోసా నిధులు వెంటనే విడుదల చేయాలని నేతలు డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అయిలయ్య,మురళీకృష్ణ,గంగుల సత్యనారాయణ,ఇర్ప రాజేష్,శ్రీకాంత్,శ్రీనివాస్,ఉదయ్,శ్రీనివాస్, సంపత్, తదితర నాయకులు పాల్గొన్నారు.
IMG 20241020 WA0756

రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి

సిర్పూర్ టీ రైల్వే సమీపంలో ఘోరం  రైలు ఢీకొని 170 గొర్రెలు, 10మేకలు మృతి కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ టీ మండలంలో రాత్రి వర్షం పడటంతో గొర్రెల కాపరులు నిద్రిస్తున్న సమయంలో ఒక్కసారిగా పక్కనే ఉన్నా రైల్వే పట్టాలపై మేకలు గోర్రేలు చేరుకున్నాయిఅంతలోనే గుర్తు తెలియని రైలు ఢీకొని శీర్ష గ్రామానికి చెందిన జడ భీమయ్య అనే యజమానికి సంబంధించిన 170గొర్రెలు 10మేకలు మృతి చెందాయి. ఉదయం ఆ యజమాని లేచి చూసే సరికి రైల్వే పట్టాల పై చెల్లా చెదురుగా పడి ఉన్నాయి.గొర్రెలను చూసి కుటుంబ సభ్యులు కన్నింటి పర్వంత మయ్యారు.