పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీస్ అధికారులను ఘనంగా సత్కరించిన జిల్లా ఎస్పీ రోహిత్ రాజు ఐపీఎస్
పోలీస్ శాఖలో విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందిన ఇద్దరు ఏఎస్సైలు మరియు ఏ ఆర్ ఎస్ ఐ లను శుక్రవారం జిల్లా ఎస్పీ రోహిత్ రాజు జిల్లా హెడ్ క్వార్టర్స్ నందు ఘనంగా సత్కరించారు. ఇల్లందు పోలీస్ స్టేషన్ నందు ఏఎస్ఐగా విధులు నిర్వర్తిస్తున్న సర్వయ్య మరియు మణుగూరు పోలీస్ స్టేషన్లో ఏఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న నిజాం అలీ మరియు అర్మడ్ రిజర్వ్ విభాగంలో విధులు నిర్వర్తిస్తున్న ఏ ఆర్ ఎస్ ఐ ఓం ప్రకాష్ మిశ్రా శుక్రవారం తో పోలీసు శాఖలో తమ సర్వీస్ ను ముగించుకొని పదవీ విరమణ పొందడం జరిగింది.గత 40 సంవత్సరాలుగా క్రమశిక్షణతో పోలీస్ శాఖలో పనిచేస్తూ ప్రజలకు సేవలు అందించిన ఈ ముగ్గురు అధికారులను ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.పదవీ విరమణ అనంతరం ప్రభుత్వం నుంచి వారికి చెందాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను త్వరితగతిన అందేలా చర్యలు చేపట్టాలని జిల్లా పోలీస్ కార్యాలయ అధికారులకు సూచించారు.అనంతరం పదవీ విరమణ పొందిన పోలీసు అధికారుల కుటుంబ సభ్యుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.తమ శేష జీవితాన్ని కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడపాలని తెలిపారు.భవిష్యత్తులో ఏ విధమైన సహాయం కావాలన్నా వెంటనే తమను సంప్రదించాలని వారికి తెలియజేశారు.పదవీ విరమణ పొందిన ముగ్గురు అధికారులు పోలీసు శాఖలో తమ అనుభవాలను ఎస్పీ గారితో పంచుకున్నారు.అనంతరం జిల్లా పోలీసు శాఖలో వారు అందించిన సేవలకు ఎస్పీ వారికి ప్రశంసా పత్రాలను అందజేశారు.ఈ కార్యక్రమంలో ఏఆర్ డిఎస్పీ సత్యనారాయణ,వెల్ఫేర్ ఆర్ఐ కృష్ణారావు,హోమ్గార్డ్స్ ఆర్ఐ నరసింహారావు,అడ్మిన్ ఆర్ఐ లాల్ బాబు,ఎంటిఓ సుధాకర్,జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షులు శ్రీనివాసరావు,ఉపాధ్యక్షుడు ఏసోబు మరియు తదితరులు పాల్గొన్నారు.