షీ టీంలో యాక్టివ్ గా పని చేయాలి: ఎస్పీ
చార్మినార్ ఎక్స్ ప్రెస్ సంగారెడ్డి జిల్లా, 31, ఆగస్ట్
షీ టీంలో యాక్టివ్ గా పని చేయాలి: ఎస్పీ
జిల్లాలో మహిళ భద్రత కోసం షీ టీం యాక్టివ్ గా పని చేయాలని ఎస్పీ రూపేష్ సూచించారు. సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో మహిళల భద్రతపై శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ షీ టీమ్ లు డివిజన్ల వారీగా బస్టాండ్, స్కూల్, కళాశాల ప్రాంతాల్లో నిత్యం గస్తీ ఉంచాలని చెప్పారు. సమావేశంలో ఎస్బీ సిఐ విజయ్ కృష్ణ, నార్కోటిక్ సిఐ రమేష్ పాల్గొన్నారు.