గచ్చిబౌలి డివిజన్ లో మౌళిక వసతుల కల్పనకు నిధులు మంజూరు చెయ్యాలని శేరిలింగంపల్లి శాసనసభ్యులు అరికపూడి గాంధీనీ కోరిన కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 03*

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని పలు కాలనీలలో నెలకొన్న సమస్యలు మరియు చేపట్టవలసిన పలు అభివృద్ధి పనుల పై ఈ రోజు ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ ని వివేకానందనగర్ లోని ఎమ్మెల్యే కార్యాలయం లో మర్యాదపూర్వకంగా కలిసి వినతిపత్రం సమర్పించిన గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ వి.గంగాధర్ రెడ్డి ఈ సందర్భంగా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధి కి సహకరించాలని, డివిజన్ లో నెలకొన్న పలు సమస్యాలను పరిష్కరించాలని, అభివృద్ధి కోసం మరిన్ని నిధులు మంజూరు చేయాలని, డివిజన్ లో అంపూర్తిగా మిగిలిపోయిన సీసీ రోడ్డుల ను వేయాలని మంచి నీటి వ్యవస్థ ను మెరుగుపర్చలని ఎమ్మెల్యే గాంధీని వినతి పత్రం ద్వారా కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి కోరడం జరిగినది. దీనికి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సానుకూలంగా స్పందించడం జరిగింది. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ గచ్చిబౌలి డివిజన్ ను అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తానని, త్వరలోనే డివిజన్ లో పర్యటిస్తానని,గచ్చిబౌలి డివిజన్ లో నెలకొన్న సమస్యలను పరిష్కరిస్తామని, అసంపూర్తిగా మిగిలిపోయిన రోడ్ల సమస్యను త్వరితగతిన పరిష్కరిస్తామని.దశల వారిగా చెప్పటి పూర్తి స్థాయిలో రోడ్ల నిర్మాణం పనులు చేపట్టి ప్రజలకు అందుబాటులో కి తీసుకువస్తామని, డ్రైనేజి వ్యవస్థను, మంచి నీటి వ్యవస్థను మెరుగుపరుస్తామని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. అదేవిధంగా ఏ చిన్న సమస్య వచ్చిన తన దృష్టికి తీసుకువస్తే తప్పకుండా పరిష్కరిస్తానని ,ఎల్లవేళలో మీకు అందుబాటులో ఉంటానని, మీకు అన్ని విధాలుగా అండగా ఉంటానని ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ తెలియచేసారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్,నల్లగండ్ల హుడా కాలనీ అధ్యక్షులు జలేందర్ రెడ్డి,సంయుక్త కార్యదర్శి కృష్ణ మూర్తి,కోశాధికారి దొర బాబు, సీనియర్ నాయకులు శేఖర్ , ప్రసాద్,సుమన్,ప్రకాశ్,రాజు, మహేష్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment