మానవత్వాన్ని చాటుకున్న పూసం రవి కుమారి .
వరద బాధితులకు అండగా ఉండి అన్నదాన కార్యక్రమం చేసిన పూసం రవికుమారి
భద్రాచలం నన్నపనేని జడ్పీ హైస్కూల్లో నందు వరద బాధితులైన అశోక్ నగర్ కొత్త కాలనీ వాసులైన వరద బాధితుల కుటుంబాల్లో ఉన్న చిన్న పిల్లలకు మానవత దృక్పథం తో పూసం రవి కుమారి మానవ హక్కుల సంఘం జిల్లా కార్యదర్శి మధ్యాహ్న భోజనం భోజన సదుపాయం అందించక పోవడంతో తమకున్న దాంట్లో చిన్న పిల్లల ఆకలి తీర్చేందుకు ఆదివారం రాత్రి ఎనిమిది గంటలకు భోజనం ఏర్పాటు చేశారు మాతృత్వాన్ని పూసం రవి కుమారి చాటుకున్నారని సమితి అధ్యక్షులు కొమ్మకి వెంకటేశ్వర్లు తెలిపారు. వరద బాధితులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు వరద బాధితుల అందగా ఉండి వారి కుటుంబాల ను ఆర్థిక సహాయం చేసే ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. పూసం రవి కుమారి అందరూ మానవత్వాన్ని చాటి వరద బాధితులకు అండగా నిలవాలని కోరారు.