ముఖ్యమంత్రి సహాయానిది ద్వారా 2.లక్షల 50వేల ఎల్ఓసీ పత్రం అందించిన ఎమ్మెల్యే గాంధీ

ముఖ్యమంత్రి సహాయానిది ద్వారా 2.లక్షల 50వేల ఎల్ఓసీ పత్రం అందించిన ఎమ్మెల్యే గాంధీ

 

గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి ఎన్ టీ ఆర్ నగర్ కి చెందిన ఎస్ కే సోహైల్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిదీ ద్వారా మంజూరైన 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయల ఆర్థిక సహాయానికి సంబందించిన ఎల్ ఓ సీ మంజూరి పత్రాన్ని కార్పొరేటర్లు దొడ్ల వెంకటేష్ గౌడ్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి బాధిత కుటుంబానికి అందచేసిన పి ఏ సీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ.

 

ఈ సందర్భంగా గాంధీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయ నిధి పేద ప్రజలకు గొప్ప వరం అని

 *వాటి వివరాలు* 

 

1.గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గోపన్ పల్లి 

ఎన్ టీ ఆర్ nనగర్ కి చెందిన సోహైల్ కి అత్యవసర వైద్య చికిత్స నిమిత్తం సీఎం రిలీఫ్ ఫండ్ కు దరఖాస్తు చేసుకొనగా ముఖ్య మంత్రి సహాయ నిదీ ద్వారా మంజూరైన 2,50,000/- రెండు లక్షల యాబై వేల రూపాయలు మంజూరి అయినవి అని గాంధీ తెలియచేసారు.

 

 ప్రజాక్షేమమే ప్రభుత్వ లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని చైర్మన్ గాంధీ పునరుద్గాటించారు . అదేవిధంగా ముఖ్యమంత్రి సహాయ నిధి నిరంతరం సేవలను అందిస్తూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా ఆదుకుంటున్నదని, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు , అభాగ్యులకు అండగా..సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా నిస్తుందని..చైర్మన్ గాంధీ ఈ సందర్బంగా తెలియచేశారు.ఈ సందర్భంగా వైద్య చికిత్స కి సహకారం అందించిన చైర్మన్ ఆరెకపూడి గాంధీ కి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియచేస్తున్నాము అని బాధితుల కుటుంబ సభ్యులు పేర్కొన్నారు.

 

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ నీలం రవీందర్ ముదిరాజు, ఖాదర్ బాయ్, బోయ కిషన్, మోజేశ్, భాస్కర్ , ఖలీమ్ ,అన్వర్ మరియు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment