దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు హాజరుకావాలి
ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్
భద్రాచలం :సోమవారం ఐటీడీఏ కార్యాలయం భద్రాచలం లో నిర్వహించనున్న గిరిజన దర్బార్ కార్యక్రమానికి అన్ని శాఖల యూనిట్ అధికారులు సకాలంలో హాజరుకావాలని ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తేలిపారు. గిరిజన ప్రజలు వారి వారి సమస్యలకు సంబంధించిన అంశాలపై లిఖితపూర్వకంగా ఫిర్యాదును అందజేయాలని ఆయన అన్నారు. ఉదయం 10.30 గంటలకు గిరిజన దర్బార్ ప్రారంభమవుతుందని పిఓ పేర్కొన్నారు.