*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ ఆగస్ట్ 30*
శేరిలింగంపల్లి జోన్ డిప్యూటీ కమీషనర్ గా నియమితులైన సందర్భంగా ముకుంద్ రెడ్డిని గచ్చిబౌలి డివిజన్ కార్పొరేటర్ గంగాధర్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.అనంతరం డిప్యూటీ కమీషనర్ ముకుంద్ రెడ్డి తో సమావేశమై గచ్చిబౌలి డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలని కోరగా త్వరలోనే అన్ని శాఖల అధికారులతో ఒక ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకుందామని డిప్యూటీ కమీషనర్ ముకుంద్ రెడ్డి హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షుడు హనుమంతు నాయక్, సీనియర్ నాయకులు శేఖర్, రాజు, పల్లపు చంద్ర మౌళి, సుమన్, మన్నే రమేష్, తదితరులు పాల్గొన్నారు