బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి

బి ఆర్ ఎస్ పార్టీ సభ్యత్వం చెక్కును అందజేసిన మాజీ ఎమ్మెల్యే భూపాల్ రెడ్డి.

చార్మినార్ ఎక్స్ ప్రెస్: అక్టోబర్ 19 ,పెద్ద శంకరంపేట్.
పెద్దశంకరంపేట మండలంలోని ఇసుక పాయల తండాకు చెందిన నునావత్ నెహ్రు ప్రమాదవశాత్తు ఇటీవల మరణించినదున వారి భార్య నునావత్ నాగమణి కి తెలంగాణ బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసిఆర్ ప్రవేశ పెట్టిన పార్టీ సభ్యత్వం 2 లక్షల రూపాయల చెక్కును నారాయణఖేడ్ మాజీ ఎమ్మెల్యే మహా రెడ్డి భూపాల్ రెడ్డి అందజేశారు.
మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇన్సూరెన్స్ పథకం ఏ రాజకీయ పార్టీలో లేదన్నారు. బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ పార్టీలోని ఏ కార్యకర్త అయిన ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ఈ పథకాన్ని ప్రవేశపెట్టారని తెలిపారు. ఈ పథకం ద్వారా నారాయణఖేడ్ నియోజకవర్గంలో అనేకమంది కార్యకర్తల కుటుంబాలకు అండగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో
తాజా మాజీ ఎంపీపీ జంగం శ్రీనివాస్, వైస్ ఎంపీపీ రమేష్, తాజా మాజీ జెడ్పిటిసి రవీందర్ నాయక్, మండల కో ఆప్షన్ సభ్యులు యాదుల, మండల రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సురేష్ గౌడ్, మాజీ ఎంపిటిసి ముజామిల్, మాజీ సర్పంచ్ గోపాల్, మాజీ ఉపసర్పంచ్ రమేష్, నాయకులు మాణిక్ రెడ్డి, గోపాల్,తదితరులు ఉన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment