రైతుగా మారిన జిల్లా కలెక్టర్

ఆదివారం జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు కలెక్టర్ క్యాంప్ ఆఫీస్ ఆనుకుని ఉన్న ఔరంగాబాద్ గొల్ల నారాయణ రైతు పొలంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ దంపతులు వారాంతంలో ఇద్దరు పిల్లలను తీసుకుని కూలీలతో కలిసి వరి నాట్లువేశారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..నారు మడి నుంచి పంట అమ్మకం వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉంటూ అవసరమైన సలహాలు, సూచనలు అందజేసి రైతు లాభదాయక సాగు చేసే దిశగా అధికారులు పని చేయాలని ఆదేశించారు. వరి నాట్లు వేస్తున్న రైతుల పొలాలను పరిశీలించి, సాగు పద్ధతులను, పంటలో వచ్చే లాభం, సాగులో ఎదురవుతున్న ఇబ్బందులు, తదితర అంశాలపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment