బ్రిటిష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం విరోచితం
— జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
బ్రిటీష్ వారిపై వడ్డే ఓబన్న పోరాటం వీరోచితమని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కొనియాడారు.శనివారం కలెక్టరేట్ కార్యాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో శ్రీ వడ్డే ఓబన్న 218వ జయంతి కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్ పర్సన్ చంద్రపాల్ సంబంధిత వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ శ్రీనివాస్ అధికారులు వడ్డెర సంఘం నాయకులతో కలిపి కలెక్టర్ వడ్డే ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా కలెక్టర్ ఆయన చరిత్రనుస్మరించుకున్నారు.
‘‘1857లో జరిగిన సిపాయిల తిరుగుబాటునే ప్రథమ స్వాతంత్ర్య యుద్ధం అంటారని. కానీ అంతకు
ముందే 1846లో తెలుగునాట ఉయ్యాలవాడ నరసింహరెడ్డితో కలిసి బ్రిటిష్ వారి దౌర్జన్యాలకు వ్యతిరేకంగా తెలుగువారి ఆత్మ
గౌరవం నిలపడం కోసం వీరో
చితంగా పోరాడారని వడ్డే ఓబన్న. ఆనాటి రేనాటి వీరుడు వడ్డే ఓబన్న చరిత్రను నేటి తరాలకు తెలియజే
యాలనే ఉద్దేశంతో ఓబన్నజయం తిని అధికారింగా నిర్వహించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.బీసీ ముద్దుబిడ్డ, స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి సందర్భంగా ఆ మహనీయుని వీరగాథను అందరు స్మరించుకోవాలనిఅన్నారు.ఈకార్యక్రమంలో సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు