మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద చిరుత సంచారం

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ అక్టోబర్ 18*

శేరిలింగంపల్లి మియాపూర్ లో చిరుత పులి సంచారం కలకలం రేపింది అదికూడా నగరం నడిబొడ్డున శుక్రవారం రాత్రి చిరుత సంచారం తో జనాలు ఆశ్చర్యపోతున్నారు అంతేకాకుండా స్థానికులు ఆందోళనకు గురయ్యారు మియాపూర్ మెట్రో స్టేషన్ వెనకాల నడిగడ్డ తండా వైపు చిరుత సంచరించినట్లు స్థానికులు మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు దీంతో సమాచారం అందుకున్న పోలీసులు నడిగడ్డ ప్రాంతానికి చేరుకొని అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చి చిరుత కోసం గాలిస్తున్నారు నగరం నడిబొడ్డులో అదీ శేరిలింగంపల్లి మియాపూర్ లో చిరుత సంచరించటం సంచలనంగా మారింది అసలు ఈ చిరుత ఎక్కడి నుండి వచ్చింది అనేది పూర్తి వివరాలు తెలియల్సి ఉంది

Join WhatsApp

Join Now

Leave a Comment