కళ్యాణ లక్ష్మి పథకం మంజూరైన 520 మంది లబ్ధిదారులకు చెక్కులను అందచేసిన ఏంఏల్ఏ అరెకపూడి గాంధీ

*శేరిలింగంపల్లి చార్మినార్ ఎక్స్ ప్రెస్ 29*

శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్ పెట్ చందానగర్ ,భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి /షాదిముబారక్ పథకం ద్వారా మంజూరైన 520 మంది లబ్ధిదారులకు 5,20,60,320/- ఐదు కోట్ల ఇరవై లక్షల అరవై వేల మూడు వందల ఇరవై రూపాయల ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కార్పొరేటర్లు ఉప్పలపాటి శ్రీకాంత్ , మంజుల రఘునాథ్ రెడ్డి తో కలిసి చెక్కుల రూపేణా అందచేసిన ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ
ఈ సందర్బంగా ఎమ్మెల్యే గాంధీ మాట్లాడుతూ ఈ రోజు 520 మంది లబ్దిదారులకు కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ చెక్కులు అందచేయడం చాలా సంతోషకరమైన విషయం అని ఎమ్మెల్యే గాంధీ తెలియచేసారు. పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంది అని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని, పేదింటి ఆడ బిడ్డకు పెద్ద అన్న లాగా నిలుస్తారు అని ఎమ్మెల్యే గాంధీ కొనియాడారు. నిరుపేదల అడా బిడ్డల పెళ్లికి దేశంలో ఎక్కడా లేని విధంగా ,మానవతా దృక్పథంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ప్రవేశపెట్టడం జరిగినది అని ,అర్హులైన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని, పేదింటి వారి ఇండ్ల లో సంతోషంతో ఆడ పిల్లల పెండ్లి జరగాలని సదుద్దేశంతో కల్యాణ లక్ష్మీ షాది ముబారక్ పథకం ఎంతగానో ఉపయోగపడుతుంది అని ఎమ్మెల్యే గాంధీ కోరారు.

ఈ కార్యక్రమంలో డిప్యూటీ తహసీల్దార్ దిలీప్, RI రాంబాబు ,మాజీ కౌన్సిలర్లు, మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, లబ్ధిదారులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు

Join WhatsApp

Join Now

Leave a Comment