శ్రామికుల పక్షాన పోరాడేది ఏఐటీయూసీ
రైతు కార్మికులు ఉత్పత్తి రంగాల వారు కార్మికులే
చార్మినార్ ఎక్స్ ప్రెస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల ప్రతినిధి ఆగస్టు 29
శ్రమ చేసే వారిని ఐక్యం చేసింది ఏఐటీయూసీ నే
మొట్టమొదటి కార్మిక సంఘం ఏఐటీయూసీ
ద్వితీయ మండల మహాసభలో షాబీర్ పాషా
సుజాతనగర్ మండల కేంద్రంలో సిపిఐ పార్టీ ఆఫీస్ నందున సిపిఐ మహాసభ కార్యక్రమంలో ఉద్దేశించి మాట్లాడిన సిపిఐ పార్టీ నాయకులు
రైతులు శ్రామికులు ఉత్పత్తి అనుబంధ రంగాలు శ్రమ చేసేవారు అంతా కార్మికుల అని కార్మికుల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం పోరాడేది ఏఐటీయూసీ మాత్రమేనని సిపిఐ జిల్లా కార్యదర్శి ఏఐటీయూసీ జిల్లా గౌరవ అధ్యక్షులు ఎస్.కె షబీర్ పాషా అన్నారు
బుధవారం మండల కేంద్రంలోని రజబ్ అలీ భవన్లో ఏఐటీయూసీ ద్వితీయ మండల మహాసభ దండు నాగేశ్వరరావు వీర్ల మల్లేష్ అధ్యక్షతన జరిగింది
ముందుగా వందలాది కార్యకర్తలతో ర్యాలీగా బయలుదేరి సుజాతనగర్ మెయిన్ సెంటర్ లోని ఏర్పాటుచేసిన ఏఐటీయూసీజెండానుఆవిష్కరించారుఈసందర్భంగాఏర్పాటుచేసినసమావేశంలో షాబీర్ పాషా మాట్లాడుతూ గ్రామీణ పేదలు అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారని ఆటో కార్మికులు ఆశా వర్కర్లు మిడ్ డే మీల్స్అంగన్వాడీలు రైస్ మిల్ హా మాలీలు వ్యవసాయ కార్మికులు సమస్యలపై పోరాటం చేయాల్సినపరిస్థితిఏర్పడుతుందన్నారుగతంలో కార్మికులు పోరాడాల్సిన పరిస్థితి ఉండేదని ఇప్పుడు రైతులు సమస్యలపైపోరాడాల్సివల్సి నా పరిస్థితి ఏర్పడిందన్నారు
రైతులకు గిట్టుబాటు ధర రైతు భరోసా రుణమాఫీ సమస్యలు ప్రభుత్వాలు మారిన సమస్యల పరిష్కరి కాలేదన్నారుకొత్తగూడెం ఎమ్మెల్యే సాంబశివరావు అసెంబ్లీలో అన్ని రంగాల కార్మికుల సమస్యలపై మాట్లాడారనితెలిపారుపెట్రోల్ డీజిల్ లో జీఎస్టీ పరిధిలోకి తేవాలని పెన్షన్లు రేషన్ కార్డులు ఇల్లు అర్హులైన వారందరికీ ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారుఏఐటీయూసీని బలపరచాలని ఎర్ర జెండా నిరంతరం పోరాటాల వల్ల ప్రజా సమస్యలను పరిష్కారంజరుగుతుందన్నరుఅనంతరం ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు కంచర్ల జమలయ్య మాట్లాడుతూ
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు
ప్రభుత్వాలు మారిన ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయలేదని మహాలక్ష్మి పథకంతో ఆటో డ్రైవర్లు నష్టపోయారని అన్నారుసెప్టెంబర్ 22వ తేదీన ఆటో యూనియన్ రాష్ట్ర మహాసభలు కొత్తగూడెంలోజరుగుతున్నాయని ఈ లోపు ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహించి స్తంభింప చేస్తామని సభా వేదికగా హెచ్చరించారుఅంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తిస్తామని ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయి అని ప్రశ్నించారు
కార్మికుల పక్షాన ఎన్నికల ఇచ్చిన హామీలను అమలుచేయకపోతే ఈ ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారుఅనంతరం ఏఐటీయూసీ మండల నూతన కమిటీని ఎన్నుకున్నారుఈకార్యక్రమంలోఏఐటీయూసీ జిల్లా సహాయ కార్యదర్శి జక్కుల రాములు మాజీ ఎంపీపీ భూక్య పద్మావతి సిపిఐ మండల కార్యదర్శి భూక్యా దస్రు సహాయ కార్యదర్శి కుమారి హనుమంతరావు పొదిల శ్రీనివాసరావు ఏఐటీయూసీ మండల అధ్యక్షులు వీర్ల మల్లేష్ వీర్ల దుర్గాప్రసాద్ మాజీ ఎంపీటీసీలు మురళి గణేష్ రైతు సంఘం నాయకులు తాళ్లూరి పాపారావు నాయకులు బొడ్డు కేశవరావు తాళ్లూరి ధర్మారావు గోపి సురేష్ అంగన్వాడి లు ఆశా వర్కర్స్ మిడ్ డే మీల్స్ ఆటో రవాణా రంగ కార్మికులు భవన నిర్మాణ కార్మికులు అమాలి కార్మికులు పెయింటింగ్ వర్కర్స్ రైతులు కార్మికులు కర్షకులు తదితరులు పాల్గొన్నారు