వైభవంగా రేణుక మాతా అభిషేకం

వైభవంగా రేణుక మాతా అభిషేకం

మెదక్ జిల్లా కొల్చారం మండల కేంద్రంలో రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులతో పంటలు సుభిక్షంగా పండి అందరు చల్లగా ఉండాలని పాల్వంచ మంగమ్మ సత్యనారాయణ గౌడ్ దంపతులు కోరుకున్నారు . అమ్మను నమ్ముకుని చేసిన పనులుసత్ఫలితాలనిస్తాయని పేర్కొన్నారు. మండల కేంద్రం కొల్చారంలో శ్రీ రేణుక ఎల్లమ్మ తృతీయ వార్షికోత్సవము అనంతరం 31 వ మంగళవారం నాడు శ్రీ రేణుకా ఎల్లమ్మ ఆలయంలో పాల్వంచ మంగమ్మ సత్యనారాయణ గౌడ్ దంపతులచే శ్రీ రేణుక ఎల్లమ్మ ఆలయంలో అభిషేక,అలంకరణ, అర్చన కార్యక్రమం నిర్వహించగా కోలాచాలకృష్ణ శర్మ మంత్రోచ్ఛహరణల మధ్య ఘనంగా జరిపారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరై తీర్థ ప్రసాదాలు స్వీకరించారు .ఈ కార్యక్రమంలో,రామకృష్ణ గౌడ్, అశోక్ గౌడ్,లక్ష్మి నారాయణ గౌడ్,శేఖర్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్,పాప గౌడ్,యాదగౌడ్,దుర్గపతి గౌడ్,సుధాకర్ గౌడ్, సంఘాల సభ్యులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment