బీజేపీ మండల అధ్యక్షుడు పుండ్ర లక్ష్మణ్ రెడ్డి కి ఘన సన్మానం
మండల కేంద్రమైన తానూర్లోని రైతు వేదిక భవనంలో బీజేపీ పార్టీకి చెందిన పలు గ్రామాల నాయకులు, కార్యకర్తలు నూతనంగా నియమితులైన బీజేపీ మండల అధ్యక్షుడు పుండ్ర లక్ష్మణ్ రెడ్డిని ఘనంగా సత్కరించారు. శాలువాతో మర్యాదపూర్వకంగా సన్మానించిన ఈ సందర్భంగా, లక్ష్మణ్ రెడ్డి మాట్లాడుతూ, తనపై నమ్మకంతో మండల అధ్యక్షుడిగా నియమించిన ముధోల్ నియోజకవర్గ శాసనసభ్యులు పవార్ రామారవు పటేల్ మరియు పార్టీ నాయకులు, కార్యకర్తలు, బూత్ స్థాయి కమిటీ సభ్యులందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
పార్టీ బలోపేతం, కార్యకర్తల అభ్యున్నతి, మండల అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి నాయకులు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.