బొజ్జ గణపయ్యకు 108 ప్రసాదాలు
నిర్మల్ పట్టణంలో ఘనంగా గణపతి నవరాత్రులు జరుగుతున్నాయి. పట్టణంలోని శాస్త్రి నగర్ దక్షిణ శ్రీ గంగా సమేత కాశీ విశ్వనాథ ఆలయంలో వినాయకుడికి నవరాత్రుల్లో భాగంగా ఎనిమిదో రోజు నెలకొల్పిన గణపయ్యకు ఆలయ పూజారి గోపాల్ జీ ఆధ్వర్యంలో 108 రకాల ప్రసాదాలను సమర్పించిన భక్తులు. దేవదేవుడికి ఇన్ని రకాల నైవేద్యాలను సమర్పించి, తమ భక్తిని చాటుకున్న భక్తులు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొని స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. ఈ భారీ నైవేద్యాన్ని చూసేందుకు అక్కడ స్థానికులు సైతం పోటీపడ్డారు. ఈ పూజా కార్యక్రమంలో కాలనీవాసులతోపాటు, భక్తులు పాల్గొన్నారు.