రైల్లో అనుమానంగా కనిపించిన బ్యాగ్.. తీసి చూస్తే పోలీసులకె కళ్లు జిగేల్…బిల్లులు లేని 13కేజీ ల గోల్డ్ బిస్కెట్లు..కేసు నమోదు చేసిన పోలీసులు!

రైల్లో అనుమానంగా కనిపించిన బ్యాగ్.. తీసి చూస్తే పోలీసులకె కళ్లు జిగేల్…బిల్లులు లేని 13కేజీ ల గోల్డ్ బిస్కెట్లు..కేసు నమోదు చేసిన పోలీసులు!

 

కర్నూలు జిల్లాలో బంగారు బిస్కెట్ల కలకలం

 

ఆదోనికి చెందిన వ్యాపారుల్ని అరెస్ట్ చేసిన పోలీసులు

 

కేరళ నుంచి బంగారాన్ని తీసుకొస్తున్నా అనే కోణం లో దర్యాప్తు చేపట్టిన పోలీసులు

 

కర్నూలు జిల్లాలో బంగారు బిస్కెట్ల వ్యవహారం కలకలంరేపింది. ఓ రైల్లో అక్రమంగా తరలిస్తున్న బంగారు బిస్కెట్లను పోలీసులు సీజ్ చేశారు. రెండు రోజుల క్రితం రూ.కోటి విలువైన 13 కిలోల బంగారు బిస్కెట్లు ఆదోనికి తరలిస్తుండగా దొరికాయి. పక్కా సమాచారం అందుకున్న కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్‌ అధికారులు పుణె ఎక్స్‌ప్రెస్‌లో తనిఖీ చేయగా.. అందులో ఓ బ్యాగ్‌లు చెక్ చేస్తే బిస్కెట్లు దొరకగా.. 12 మందిని అరెస్ట్ చేశారు. బంగారు వ్యాపారులు, ఏజెంట్లు కేరళ నుంచి వీటిని తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు.. ఆదోనికి చెందిన కొంతమంది బంగారం వ్యాపారులు 13 కిలోల 24 క్యారెట్ల బంగారు బిస్కెట్లు ఎర్నాకుళంలో కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

 

బంగారు బిస్కెట్లను కన్యాకుమారి – పుణె ఎక్స్‌ప్రెస్‌లో తిరుగు ప్రయాణం అయ్యారు. ఆదోని వ్యాపారులు ఎలాంటి పన్నులు చెల్లించకుండా బంగారం రైలులో తీసుకెళ్తున్నారని కేంద్ర ఎక్సైజ్‌ అండ్‌ కస్టమ్స్‌ అధికారులకు సమాచారం వచ్చింది. వెంటనే ఆ రైలులో తనిఖీలు చేయగా.. బంగారం అక్రమ రవాణా చేస్తున్న 12 మంది ఆదోని వ్యాపారులను అరెస్ట్ చేసిన బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్నారు. బంగారం, రవాణా చేస్తున్న వ్యాపారులను తాడిపత్రిలోని కస్టమ్స్‌ కార్యాలయానికి తీసుకెళ్లి ప్రశ్నించారట. అక్కడి నుంచి విజయవాడకు తరలించారట. అయితే పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

 

కొంతమంది బంగారు వ్యాపారులు బిల్లులు లేకుండా బంగారాన్ని అక్రమంగా రవాణా చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కేరళ, హైదరాబాద్, చెన్నై, ముంబై, బెంగళూరు వంటి నగరాలకు ఆదోని వ్యాపారులు, ఏజెంట్లు కొందరు వెళ్లి అక్కడ వ్యాపారులతో పెద్ద మొత్తంలో బంగారం బిస్కెట్లు కొనుగోలు చేస్తున్నారట. ఆ బంగారాన్ని రైలు మార్గంలో తీసుకొస్తున్నట్లు తెలుస్తోంది. ఈ బంగారానికి జీఎస్టీ చెల్లించడం లేదని చెబుతున్నారు. ఈ క్రమంలో కేంద్ర ఎక్సైజ్, కస్టమ్స్ అధికారులకు సమాచారం రావడంతో ఈ బంగారు బిస్కెట్లను సీజ్ చేశారు. మొత్తం మీద ఈ బంగారం వ్యవహారం చర్చనీయాంశంగా మారింది.. పోలీసులు కూడా నిఘాను పెంచినట్లు తెలుస్తోంది. ఈ బంగారానాకి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

Join WhatsApp

Join Now

Leave a Comment