జర్నలిస్టు సుదర్శన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.- బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి.

జర్నలిస్టు సుదర్శన్ పై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలి.

బయ్యారం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు సుమన్ రెడ్డి.

బయ్యారం(చార్మినార్ ఎక్స్ ప్రెస్)

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో జర్నలిస్టుపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని బయ్యారం ప్రెస్ క్లబ్ ప్రెస సుమన్ రెడ్డి డిమాండ్ చేశారు.ఇల్లందు మండలంలో ఆదాబ్ హైదరాబాద్ అనే దినపత్రిక రిపోర్టర్ గా పనిచేస్తున్న నిట్ట సుదర్శన్ పై శుక్రవారం రాత్రి కొంతమంది గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి కొట్టడం జరిగిందని ఈ దాడిని బయ్యారం ప్రెస్ క్లబ్ మెంబెర్స్ తీవ్రంగా ఖండించారు. జర్నలిస్టుపై దాడి చేసిన వాళ్లందరిని అరెస్టు చేసి చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని సుమన్ రెడ్డి డిమాండ్ చేశారు.అంతే కాకుండా ఈ మధ్య కాలంలో జర్నలిస్టులు వార్తల సేకరణ కోసం ఎక్కడికి వెళ్లినా కావాలని కేసులు పెట్టి వేధిస్తున్నారని,అవినీతిని ప్రశ్నించే గొంతుకను నొక్కే ప్రయత్నాలు చేస్తున్నారనీ,సంఘంలో జరుగుతున్న అవినీతిని బయటికి తీసే జర్నలిస్టులపై ఎదురు దాడి చేస్తూ,కేసులు పెడతామని బెదిరిస్తున్నారని వాపోయారు.

Join WhatsApp

Join Now

Leave a Comment