మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద 25 వేలు ఆర్థిక సహాయం

మృతుల కుటుంబాలకు తక్షణ సాయం కింద 25 వేలు ఆర్థిక సహాయం

చార్మినార్ ఎక్స్ప్రెస్ మెదక్ జిల్లా బ్యూరో అక్టోబర్ 16 ప్రతినిధి

మెదక్ జిల్లా శివ్వంపేట మండలంలోని ఉసిరికపల్లి వద్ద జరిగిన కారు రోడ్డు ప్రమాదంలో రత్నపూర్, ఉసిరికపల్లికి, పాంబండ తాండలకు చెందిన గిరిజనులు ఏడుగురు మృతి చెందారు. విషయం తెలుసుకున్న ప్రముఖ సంఘ సేవకులు, తాజా మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్త హుటాహుటిన మృతుల కుటుంబాల వద్దకు వెళ్లి పరామర్శించి ఓదార్చడం జరిగింది. బాధిత కుటుంబాలకు అన్ని విధాలా ఆదుకుంటామని మనో దర్యం తెలుపుతూ వారికి తక్షణ సహాయం క్రింద తన స్వంత నిధుల నుండి 25 వేలు అందచేయడం జరిగింది. కార్యక్రమంలో మాజీ గ్రంధాలయం చెర్మన్ చంద్రగౌడ్, బిఆరెస్ పార్టీ మండల అధ్యక్షుడు రమణ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment