గిరిజనుల నుండి వివిధ సమస్యల గురించి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది

గిరిజనుల నుండి వివిధ సమస్యల గురించి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగింది

 

ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్

 

భద్రాచలం:మారుమూల ఆదివాసి గిరిజన గ్రామాలనుండి గిరిజన దర్బార్ లో అర్జీలు సమర్పించడానికి వచ్చే గిరిజనుల నుండి వివిధ సమస్యల గురించి వచ్చిన దరఖాస్తులను స్వీకరించడం జరిగిందని ఐ టి డి ఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ అన్నారు.

 సోమవారం ఐటిడిఏ సమావేశ మందిరంలో నిర్వహించిన గిరిజన దర్బార్ లో వివిధ సమస్యల గురించి విన్నవించడానికి వచ్చిన గిరిజనుల నుండి యూనిట్ అధికారుల సమక్షంలో ఆయన అర్జీలు స్వీకరించారు. ఉపాధ్యాయుల ఎంఎల్సి ఎన్నికల కోడ్ ఉన్నందున గిరిజనుల సమస్యలకు సంబంధించిన దరఖాస్తులను మాత్రమే స్వీకరించడం జరిగిందని అన్నారు. సోమవారం: గిరిజన దర్బార్ కు ఎక్కువ శాతం గిరిజనులు పోడు భూముల పట్టాల కొరకు, గిరి వికాసం ద్వారా సబ్సిడీపై కరెంటు, బోరు, మోటార్ల కొరకు, పోడు భూముల పట్టాలు ఆన్లైన్ చేయించుట కొరకు, స్వయం ఉపాధి ద్వారా జీవనోపాధి పెంపొందించుకోవడానికి ఆర్థిక వెసులుబాటు కల్పించుట కొరకు, అలాగే భూ సమస్యలు, వ్యక్తిగత సమస్యలు ,గిరిజన గ్రామాలలో వ్యవసాయం చేసుకోవడానికి బోరు, మోటార్లు ఇప్పించుట కొరకు, మారుమూల ప్రాంత గిరిజన గ్రామాలకు వెళ్లడానికి రోడ్డు సౌకర్యం, కరెంటు ఇప్పించుట కొరకు, సోలార్ విద్యుత్ సరఫరా ఇప్పించుట కొరకు, నూతనంగా మత్య సొసైటీలు ఏర్పాటు కొరకు, వితంతు, ఒంటరి మహిళ, ఆసరా పెన్షన్లు ఇప్పించుట కొరకు, ప్రభుత్వ, ప్రైవేటు రంగాలలో జీవనోపాధి పెంపొందించుకోవడానికి వ్యక్తిగత శిక్షణలు ఇప్పించుట కొరకు, అలాగే దీర్ఘకాలిక వ్యాధులకు వైద్యం చేయించుకోవడానికి ఆర్థిక సహాయం అందించుట కొరకు, గిరిజనులు అర్జీలు పెట్టుకున్నారని ఆయన అన్నారు. గిరిజన దర్బార్ లో వచ్చిన అర్జీలు అన్ని ప్రత్యేకమైన రిజిస్టర్లో మరియు ఆన్లైన్ ద్వారా నమోదు చేయడం జరుగుతుందని, ప్రస్తుతం ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ ఉన్నందున, వివిధ సమస్యల గురించి అర్జీలు పెట్టిన గిరిజనుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందని, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ ముగియగానే వచ్చిన దరఖాస్తులను పరిష్కరించడానికి ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో సహాయ ప్రాజెక్టు అధికారి జనరల్ డేవిడ్ రాజ్, డిడి ట్రైబల్ వెల్ఫేర్ అధికారిని మణెమ్మ ,ఆర్సిఓ గురుకులం నాగార్జున రావు, ఎస్ డి సి రవీంద్రనాథ్, ఈఈ ట్రైబల్ వెల్ఫేర్ చంద్రశేఖర్, ఎస్ ఓ భాస్కర్,ఏపీఓ పవర్ వేణు, , ఎస్ డి సి ఉదయ్ కుమార్, డి టి ఆర్ ఓ ఎఫ్ ఆర్ లక్ష్మీనారాయణ,, మేనేజర్ ఆదినారాయణ, కొండరెడ్ల విభాగం అధికారి మనిధర్,ఐసిడిఎస్ సూపర్వైజర్ రాజేశ్వరి, ఇతర విభాగాలకు చెందిన సిబ్బంది నవ్య, మమత, జోగారావు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment

Exit mobile version