కేంద్రప్రభుత్వంప్రవేశపెట్టింది ప్రజా, కార్మిక , రైతు వ్యతిరేక యూనియన్ 2025 బడ్జెట్

కేంద్రప్రభుత్వంప్రవేశపెట్టింది ప్రజా ,కార్మిక ,రైతు వ్యతిరేక యూనియన్ 2025 బడ్జెట్

— సీపీఎం మెదక్ జిల్లాకార్య

దర్శికె.నర్సమ్మ

 

 

కేంద్ర బీజేపీ ఆర్ధిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ గారు 2025 వార్షిక బడ్జెట్ ప్రవేశ పెట్టినది కార్పొరేట్లకు రాయితీలు పేదలకు భారాలు మోపే బడ్జెట్ గా ఉందని సీపీఎం మెదక్ జిల్లా కార్యదర్శి కె.నర్సమ్మ అన్నారు.కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామీణ పేదలను విస్మరించిన బడ్జెట్ ను వ్యతిరేకించినకేంద్ర బడ్జెట్50 , 65,345 లక్షలకోట్ల బడ్జెట్ లో గ్రామీణ పేదలకు రాయితీలను కట్ చేసి బడా కార్పొరేట్లకు రాయితీలను ఇచ్చింది .పేదలకు రైతాంగానికి సబ్సిడీలను వదిలించడాన్ని ఆమె మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కొనుగోలు శక్తిని పెంచే గ్రామీణ ఉపాధి హామీ పనికి గత సంవత్సరం కేటాయించిన 86 వేల కోట్లను మాత్రమే బడ్జెట్లో చూపింది ఆహార భద్రతకు పెద్ద ఎత్తున కోత విధించింది. గత సంవత్సరం బడ్జెట్లో 2.75 కోట్లు కేటాయించగా ఏ బడ్జెట్లో 2.4 కోట్లకు కుదించింది. ఇది దేశంలో ఉన్న 24 కోట్ల రేషన్ కార్డుల లబ్ధిదారులకు కోలుకోవాలని దెబ్బ తగిలిందన్నారు. యూరియా సబ్సిడీని గత బడ్జెట్లో 1.19 లక్షల కోట్లు కేటాయించిన ప్రభుత్వం 1.18 లక్షల కోట్లకు కుదించింది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద పేదలకు ఇండ్ల నిర్మాణం చేయడానికి గత బడ్జెట్లో 54,500 కోట్లు కేటాయించిన ప్రభుత్వం 32,486 కోట్లకు కుదించింది. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కేటాయింపులు సంక్షేమ విద్యార్థుల స్కాలర్షిప్లు , ఫీజు రియంబర్స్మెంట్, సామాజిక పింఛన్లు ,అంగన్వాడీ కేంద్రాలకు నిధుల కేటాయింపు వంటి వాటి ఊసే లేదన్నారు. గ్రామీణ రక్షిత మంచినీటి సరఫరాకు గత బడ్జెట్లో 70 వేల కోట్లు కేటాయించిన ప్రభుత్వం ఈసారి 67 వేల కోట్లకు కుదించిందన్నారు.మరొక పక్క ప్రభుత్వ భూములు అమ్మకం ద్వారా 10 లక్షల కోట్లను ఆదాయం సమకూర్చుకుంటామని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మల సీతారామన్ ప్రకటించడం ఆందోళన కలిగించే అంశం అన్నారు. తక్షణమే ఈ ప్రతిపాదనలో వెనక్కి తీసుకొని సంక్షేమానికి అధిక నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు.

Join WhatsApp

Join Now

Leave a Comment