రాష్ట్రస్థాయి లో అబకస్ వేదిక మాథ్ పరీక్ష పోటీలో అక్షర విద్యార్థులు
హర్షం వ్యక్తం చేసిన ప్రిన్సిపాల్ షేక్ అహ్మద్
సంగారెడ్డి జిల్లా స్థాయిలో నిర్వహించిన అబకస్ మరియు వేదిక్ మాథ్ పరీక్ష పోటీలో అక్షర స్కూల్ వట్పల్లి విద్యార్థులు ఎంపికైనట్లు కరస్పాండెంట్ షేక్ అహ్మద్ తెలిపారు. బి. తారా దేవి అనికేత్ గౌడ్, స్ఫూర్తి హిమాన్ష్, జస్వంత్ రాష్ట్ర స్థాయి లో ఎంపికైనట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమం సంగారెడ్డి (కంది)లో ముఖ్య అతిధులుగా మండల విద్యాధికారి జోగప్ప, ట్రస్మా రాష్ట్ర సలహాదారులు పూసల లింగగౌడ్, విశ్వం ఏడ్యూటెక్ సొల్యూషన్ – హైదరాబాద్ హెడ్ జీవన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి లో ఎన్నికైన విద్యార్థులను అభినందించారు.ఈ కార్యక్రమంలో అబకస్ మరియు వేదిక్ మాథ్ టీచర్స్ సాగరిక, ఇ. సంగీత తదితరులు పాల్గొన్నారు.